ఇదే మంచి తరుణం..ఎలక్ట్రిక్ వెహికల్స్పై భారీ డిస్కౌంట్స్
ఎలక్ట్రిక్ వెహికిల్స్ ధరలు దిగొస్తున్నాయి. మార్కెట్లోని టాప్ కంపెనీలు తమ పాపులర్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. టాటా, మహీంద్రా, హీరో, ఏథర్ సంస్థలు ఆయా ఈవీలపై ఏకంగా 3 లక్షల రూపాయల వరకు రేట్లను తగ్గించడం విశేషం. పెట్రోల్ లేదా డీజిల్ వాహనాలు కాలుష్యానికి దారి తీస్తున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
ఈ క్రమంలో గత కొన్నేండ్లుగా ఈవీల అమ్మకాలు పెరిగాయి. తాజాగా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించడంతో అమ్మకాలు మరింత పుంజుకునే అవకాశం ఉంది. డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోవడంతో భారీ డిస్కౌంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్యూవీ400, హీరో వీ1 ప్రో-వీ1 ప్లస్, ఏథర్ 450-రిజ్టా మోడళ్లు చౌకయ్యాయి. ఈ డిస్కౌంట్లలో ఎక్కువ భాగం వాహన తయారీ సంస్థలు భరిస్తుండగా, మిగతా వాటాను డీలర్లు మోస్తున్నారు. మొత్తానికి దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ జోష్ను అందిపుచ్చుకున్న వాహన రంగ కంపెనీలు.. పొంగల్, సంక్రాంతి ఉత్సాహాన్నీ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
