ఏపీలో ప్రజలకు డబుల్ అలర్ట్.. పెరుగుతున్న చలి..పొంచి ఉన్న వానగండం వీడియో
మొంథా తుఫాను ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఏపీని మరో అల్పపీడనం భయపెడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కూడా గణనీయంగా పెరిగింది.
విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. నవంబరు 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నవంబరు 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది వాయుగుండంగా మారే అవకాశం తక్కువే అయినప్పటికీ, దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి 27 వరకు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో అల్పపీడనంపై మరింత స్పష్టత వస్తుందని తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం :
మహేష్, రాజమౌళి మూవీ టైటిల్ అదేనా? వీడియో
మీ బ్యాంక్ ఎకౌంట్ భద్రమేనా? వీడియో
మోడల్ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో
వైరల్ వీడియోలు
ఏలూరులో వైభవంగా గంగానమ్మ జాతర
‘దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉండిపోయారు’
‘నెయ్యి అనే పదార్థం లేకుండానే లడ్డూని తయారు చేశారు’
అతన్ని చూడగానే కోతులు పరుగో పరుగు..
ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో
పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు
నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

