AP News: అరె.! ఎవర్రా మీరంతా.. ఖాకీలను చూడగానే కారు వదిలి పారిపోయారు.. సీన్ కట్ చేస్తే
అక్రమంగా రాష్ట్ర సరిహద్దును దాటిస్తోన్న 13 ఎర్ర చందనం దుంగలను శ్రీసత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి సమీపంలో స్థానిక అటవీశాఖ అధికారులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో..
అక్రమంగా రాష్ట్ర సరిహద్దును దాటిస్తోన్న 13 ఎర్ర చందనం దుంగలను శ్రీసత్యసాయి జిల్లా అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నల్లచెరువు మండలం పెద్ద ఎల్లంపల్లి సమీపంలో స్థానిక అటవీశాఖ అధికారులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా కర్ణాటక నెంబర్ ప్లేట్తో ఉన్న ఆ కారు వచ్చింది. పోలీసులు చూసి కూడా ఆ వాహనం ఆగకుండా వెళ్లిపోవడంతో.. ఖాకీలు దాన్ని వెంబడించారు. కట్ చేస్తే.. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. ఇక నిందితులు వదిలేసి పరారైన కారులో 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు అటవీ శాఖ అధికారులు. కారుకు నకిలీ నెంబర్ ప్లేట్ పెట్టుకుని ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం కారుతో పాటు దుంగలను కదిరికి తరలించారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి కారు నెంబర్ల ఆధారంగా అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

