
రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం.. కొంత మంది రెగ్యులర్ గా రైలు లో ప్రయాణిస్తూ ఉంటారు. ఉద్యోగాల కోసం, చదువులకోసం నిత్యం రైలులో ప్రయాణించేవారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇక తీరధయాత్రలు, ట్రిప్పులు అంటూ వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అప్పుడప్పుడూ ట్రైన్లలో ప్రయాణించేవారికి ట్రాన్స్జెండర్లు తారసపడుతుండటం సర్వసాధారణం. వారంతా కూడా కొందరి ప్రయాణీకుల నుంచి డబ్బులు అడుగుతుండటం మనం చూస్తూనే ఉంటాం.
అయితే కొంతమంది ట్రైన్ లో ట్రాన్స్ జెండర్స్ నుంచి తప్పించుకునేందుకు రకరకాల చేష్టలు చేస్తుంటారు. కొంతమంది వాళ్లతో సరదాగా ముచ్చట్లు పెడితే.. మరికొంతమంది వాళ్ల నుంచి తప్పించుకునేందుకు వాష్ రూమ్ లలో కూడా దాక్కుంటూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి ట్రాన్స్ జెండర్స్ నుంచి తప్పించుకునేందుకు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఓ పాసింజర్ ట్రైన్ లో ప్రయాణిస్తుండగా.. ట్రాన్స్ జెండర్స్ డబ్బులు అడుగుతూ అక్కడికి వచ్చింది. వెంటనే అతడు మూగవాడిగా నటించాడు. తన దగ్గర డబ్బులు లేవు అంటూ సైగలు చేశాడు. అంతే అతను చెప్పింది నిజమని నమ్మిన ఆ ట్రాన్స్ జెండర్స్ .. మూగవాడు అనుకోని తలపై చేయిపెట్టి దీవించి మరీ వెళ్ళింది. ఆమె వెళ్లిన తర్వాత అక్కడున్న బాయ్స్ తెగ నవ్వుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీరియోకి నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..