Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పద్మశ్రీ పురస్కారం అందుకున్న ట్రాన్స్‎జెండర్.. అవార్డు తీసుకునేటప్పుడు ఏం చేసిందో తెలుసా..

ట్రాన్స్‎జెండర్ జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి కళలకు చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో 2021 పద్మ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును ఆమెకు అందజేశారు. మంజమ్మ అవార్డు తీసుకునే ముందు దిష్టి తీశారు...

Viral Video: పద్మశ్రీ పురస్కారం అందుకున్న ట్రాన్స్‎జెండర్.. అవార్డు తీసుకునేటప్పుడు ఏం చేసిందో తెలుసా..
Award
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 09, 2021 | 9:46 PM

ట్రాన్స్‎జెండర్ జానపద నృత్యకారిణి మంజమ్మ జోగతి కళలకు చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో 2021 పద్మ అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ అవార్డును ఆమెకు అందజేశారు. మంజమ్మ అవార్డు తీసుకునే ముందు దిష్టి తీశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జానపద కళారూపాల కోసం కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటు చేసిన జనపద అకాడమీలో చేరిన మొదటి ట్రాన్స్ ప్రెసిడెంట్‎గా నిలిచారు.

ఇప్పుడు 60 ఏళ్ల వయస్సు మంజమ్మ జోగతి, దశాబ్దాల సామాజిక, ఆర్థిక పోరాటాల తర్వాత పద్మశ్రీ అవార్డు వచ్చింది. వాస్తవానికి మంజునాథ్ శెట్టి అని పేరు పెట్టబడిన మంజమ్మ జోగటి యుక్తవయస్సులో స్త్రీగా లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. ఆమె కుటుంబం ఆమెను జోగప్పగా దీక్ష చేయడానికి హోస్పేట్ సమీపంలోని హులిగేయమ్మ ఆలయానికి తీసుకువెళ్లింది. దేవత రేణుకా ఎల్లమ్మ సేవలో తమను తాము అంకితం చేసుకున్న ట్రాన్స్‌జెండర్ల సంఘం. ఈ కమ్యూనిటీ సభ్యులు దేవతను వివాహం చేసుకున్నట్లు భావిస్తారు.

పేదరికం, సాంఘిక బహిష్కరణ, అత్యాచారాల మధ్య, మంజమ్మ జోగతి పోరాటం చేశారు. జోగతి నృత్య మరియు జానపద పాటలు, వివిధ స్త్రీ దేవతలను స్తుతిస్తూ కన్నడ భాషా సొనెట్‌లలో ప్రావీణ్యం సంపాదించింది. 2006లో, ఆమెకు కర్ణాటక జనపద అకాడమీ అవార్డు లభించింది. 13 సంవత్సరాల తర్వాత, 2019లో ఆమె సంస్థ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. 2010లో కర్ణాటక ప్రభుత్వం ఆమెను వార్షిక కన్నడ రాజ్యోత్సవ అవార్డుతో సత్కరించింది.

Read Also.. Accident: జోధ్‌పూర్‌లో ఆడి కారు బీభత్సం.. ఒకరు మృతి.. తొమ్మిది మందికి గాయాలు..

సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
సంచలన నిర్ణయం.. హెచ్‌సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
ఆందోళన వద్దు ఆదుకుంటాం.. ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు భరోసా
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
రెండేళ్ల నిషేధం తర్వాత నాసిర్ గ్రాండ్ రీ ఎంట్రీ!
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
జితేష్-దయాల్ క్యాచ్ మిస్.. కోహ్లీ ప్రస్టేషన్ చూడాల్సిందే భయ్యో
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
ట్రంప్‌ సుంకాలను రద్దు చేస్తున్నారా? వైట్‌ హౌస్‌ ప్రకటన ఏంటి?
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ సరికొత్త రికార్డు.. వాటన్నింటిని దాటి..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
ప్లే ఆఫ్స్‌కు దూరంగా 3 జట్లు.. 2వ వారంలోనే చేతులెత్తేశారుగా..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే..
IPL 2025: రేపటి మ్యాచ్‌ల్లో గెలిచేది ఏ జట్లంటే?
IPL 2025: రేపటి మ్యాచ్‌ల్లో గెలిచేది ఏ జట్లంటే?