
‘ఫ్లూట్ జింక ముందు ఊదు సింహం ముందు కాదు’ అని ఓ తెలుగు సినిమాలోని డైలాగ్ గుర్తుండే ఉంటుంది. కానీ ఇక్కడో వ్యక్తి మాత్రం ఫ్లూట్ ఊదడమే కాదు.. ఏకంగా ఓ పులికి లిక్కర్ తాపించాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్టోబర్ 4, 2025న మధ్యప్రదేశ్లోని పెంచ్లో CCTVలో ఒక ఆసక్తికర సంఘటన రికార్డ్ అయింది. 52 ఏళ్ల దినసరి కూలీ రాజు పటేల్ అర్థరాత్రి వీధిలో ఓ పెద్ద పులికి లిక్కర్ తాపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
సాధారణంగా ఒంటరిగా పులి కంట పడ్డామా వెంటనే దాడి చేస్తుంది. పులిని చూస్తే పిడికెడు మీసాలు ఉన్నోడు కూడా పిరికితో పరుగెత్తాల్సిందే. ఆ వ్యక్తి మాత్రం పులిని చూసి ఏ మాత్రం జంకలేదు. పైగా పులిని దగ్గరకు తీసుకున్నాడు. అంతేకాదు దానికి లిక్కర్ కూడా తాగించాడు.
On October 4, 2025, in Pench, India, a surreal moment was captured on CCTV. The photo shows Raju Patel, a 52-year-old laborer, patting a tiger he mistook for a “big cat” after a late-night card game. Tipsy from homemade liquor, Raju stumbled onto a street where a sub-adult Bengal… pic.twitter.com/FXbZsGeawy
— Constituent 🇺🇸🌺🐦🕊️ 🕉️ (@808constituent) October 23, 2025
వైరల్ వీడియోలో రాజు పటేల్ అనే వ్యక్తి తెల్లవారుజాము దాకా పీకల దాకా మద్యం తాగి బయటికి వచ్చాడు. అదే మత్తులో వెళ్తుండగా అతడికి ఒక పెద్ద పులి కనిపించింది. ఆ పెద్దపులిని చూసిన రాజు పటేల్ ఏమాత్రం భయపడలేదు. దానిని దగ్గరికి తీసుకుని తలపై నిమిరాడు. పైగా తన చేతిలో ఉన్న సీసా లో ఉన్న మిగిలిన మద్యాన్ని పులికి తాగించబోయాడు. ఆ పులి కూడా తాగినట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు పెంచ్ నేషనల్ పార్క్ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. ఈ దృశ్యాలు చూసిన తర్వాత రాజు పటేల్ ధైర్యంపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది ఏఐ క్రియేషన్ అని నిపుణులు తేల్చేశారు. నెటిజన్లు మాత్రం ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఏఐ కాలంలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియడంలేదని పోస్టులు పెడుతున్నారు.