AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా.. గంగమ్మ చెంత మహిళా యాత్రికురాలు ఏం చేసిందంటే?

హరిద్వార్‌లోని గంగా నది తీరంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా భావించే గంగా ఘాట్ వద్ద ఒక మహిళ తన పెంపుడు కుక్కకు స్నానం చేయించడం ఈ వివాదానికి మూలమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు.

పుణ్యక్షేత్రం అని కూడా చూడకుండా.. గంగమ్మ చెంత మహిళా యాత్రికురాలు ఏం చేసిందంటే?
Dog Bathing Controversy
Balaraju Goud
|

Updated on: May 02, 2026 | 12:48 PM

Share

హరిద్వార్‌లోని గంగా నది తీరంలో ఇటీవల జరిగిన ఒక సంఘటన సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. విశ్వాసానికి, భక్తికి ప్రతీకగా భావించే గంగా ఘాట్ వద్ద ఒక మహిళ తన పెంపుడు కుక్కకు స్నానం చేయించడం ఈ వివాదానికి మూలమైంది.

ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం హరిద్వార్‌కు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు పాప ప్రక్షాళన కోసం వస్తుంటారు. అయితే, ఒక మహిళ తన కుటుంబంతో కలిసి పెంపుడు కుక్కను గంగా ఘాట్‌కు తీసుకువచ్చింది. ఆమె తోపాటు అందరూ స్నానాలు ఆచరించే పవిత్ర తీర్థంలోనే కుక్కను కూడా ముంచడం ప్రారంభించింది. ఇది చూసిన స్థానిక భక్తులు, పూజారులు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేశారు. “ఇది పుణ్యక్షేత్రం, ఇక్కడ జంతువులకు స్నానం చేయించడం సంప్రదాయ విరుద్ధం” అని వారు ఆమెను నిలదీశారు.

ప్రజల నిరసనను ఆ మహిళ మొదట బేఖాతరు చేసింది. స్థానికులు ఒత్తిడి పెంచడంతో ఆమె వారితో తీవ్రమైన వాదనకు దిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడున్న వారితో ఆమె వాగ్వివాదానికి దిగింది. ప్రతిగా ఆ మహిళ నిరసనకారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చివరకు ఆమె కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని, ఆమెను అక్కడి నుంచి పంపించివేయడంతో గొడవ సద్దుమణిగింది.

వైరల్ వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. మతపరమైన స్థలాలకు కొన్ని నియమాలు ఉంటాయని, లక్షలాది మంది నమ్మకాన్ని గౌరవించాలని వీరు వాదిస్తున్నారు. ఇలాంటి పనులు పవిత్రతను దెబ్బతీస్తాయని పేర్కొంటున్నారు. కుక్కలు కూడా దైవ స్వరూపాలేనని, మూగజీవాలను నదిలో స్నానం చేయించడంలో తప్పేముందని వీరు ప్రశ్నిస్తున్నారు. జంతువులు ప్రకృతిలో భాగమని వారి వాదన.

ఈ సంఘటన పవిత్ర స్థలాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు, సామాజిక సంప్రదాయాలకు మధ్య ఉన్న ఘర్షణను ప్రతిబింబించింది. భక్తి భావంతో కూడిన ప్రదేశాలలో ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రవర్తించాలని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి వివాదాలు పునరావృతం కాకుండా అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని భక్తులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us