Viral Video: విద్యార్థులతో టాయిలెట్లు కడిగించిన టీచర్లు.. వంటమనిషి తీసిన వీడియో వైరల్

|

Jul 28, 2022 | 4:57 PM

వీడియో షేర్‌ చేసిన వంటమనిషి మీద ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన స్కూల్ లో వంటమనిషి విజయలక్ష్మి

Viral Video: విద్యార్థులతో టాయిలెట్లు కడిగించిన టీచర్లు.. వంటమనిషి తీసిన వీడియో వైరల్
School Students
Follow us on

Viral Video: కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ జిల్లా నాగవిలో స్కూల్‌ విద్యార్థినులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను స్కూల్లో పని చేస్తున్న వంట మనిషి వాట్సాప్ లో షేర్ చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత 6, 7వ తరగతి విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లను శుభ్రం చేస్తున్న ఫోటోలు, వీడియోలు వెలుగులోకి రావడంతో విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. విద్యార్థులు సమయానికి స్కూల్‌కి రాకపోవడంతో మరుగుదొడ్లు శుభ్రం చేయాలని పాఠశాల యాజమాన్యం ఆదేశించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు విద్యాశాఖ తెలిపింది.

మరోవైపు, వీడియో షేర్‌ చేసిన వంటమనిషి మీద ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన స్కూల్ లో వంటమనిషి విజయలక్ష్మి చలవాడి మాట్లాడుతూ, తాను జూలై 12న ఈ వీడియో తీశానని చెప్పుకొచ్చింది. ఆ రోజు “పిల్లలు నా వద్దకు వచ్చి టాయిలెట్‌ను శుభ్రం చేయడానికి బకెట్, చీపురు అడిగారు. టీచర్లు ఆ పని చేయమన్నారని చెప్పారు. నాకెందుకో అది సరైంది కాదనిపించింది. అందుకే వీడియో తీసి తన వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశానంటూ ఆమె వివరించింది.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో వైరల్ కావడంతో, కాంట్రాక్ట్ పద్ధతిలో పాఠశాలలో పనిచేస్తున్న వంట మనిషి ఉపాధ్యాయులు, అధికారుల టార్గెట్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి