Bizarre Incident: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి! షాక్‌ తిన్న వైద్యులు!!

| Edited By: Janardhan Veluru

Feb 05, 2022 | 4:19 PM

VIral News: చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం(Post-Mortem) చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన స్పెయిన్‌(Spain)లో జరిగింది. స్పెయిన్‌కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది..

Bizarre Incident: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న వ్యక్తి! షాక్‌ తిన్న వైద్యులు!!
Man Woke Up Shortly Before Postmortem
Follow us on

Viral News: చనిపోయిన వ్యక్తికి పోస్టుమార్టం(Post-Mortem) చేస్తుండగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఆ వ్యక్తి. ఈ సంఘటన స్పెయిన్‌(Spain)లో జరిగింది. స్పెయిన్‌కి చెందిన ఓ ఖైదీకి అనారోగ్యం చేసింది. దాంతో అతడిని జైలు అధికారులు ఆస్పత్రికి తరాలించారు . అయితే అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారు. దాంతో ఆ ఖైదీ చనిపోయిన విషయాన్ని అతని కుటుంబానికి తెలియజేశారు. అంతేకాదు. అతని శరీరం సైనోసిస్ సంకేతాలను చూపించిందని, ఆక్సిజన్ లేకపోవడం వల్ల చర్మం రంగు మారిందని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో చనిపోయిన వ్యక్తికి పోస్ట్‌ మార్టం చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

పోస్ట్‌మార్టం చేసేందుకు అతని శరీరంపై ప్రణాళిక బద్ధంగా నిర్వహించాల్సిన కోతల తాలుకా పెన్‌ గుర్తులు కూడా ఉన్నాయి. కానీ ఇంతలో ఆ వ్యక్తి వింతగా అరుస్తూ నిద్రనుంచి మేల్కొన్నట్లుగా లేచాడు. దీంతో వైద్యులు ఒక్కసారిగా దిగ్భ్రాంతి చెందారు. దాంతో ఆ వ్యక్తిని మరొక ఆస్ప్రతికి తరలించి తగిన వైద్యం అందించారు. ప్రసుత్తం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని స్పానిష్ జైలు అధికారులు తెలిపారు.

Also Read:

Anasuya: ‘దర్జా’గా వస్తోన్న స్టార్‌ యాంకరమ్మ.. అనసూయ కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ చూశారా.?

 గుడ్ల కోసం గూట్లోకి దూరిన పాము.. పట్టపగలే చుక్కలు చూపించిన పిట్టలు.. షాకింగ్ వీడియో..