MS Dhoni: తన ఇన్ స్టా ఖాతాలో కేవలం నలుగురినే ఫాలో అవుతున్న ధోని.. వారెవరో మీకు తెల్సా..?

|

Sep 21, 2022 | 7:52 PM

ఇన్ స్టాలో దాదాపు 40 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ధోని.. కేవలం నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా ఉన్నాడు.

MS Dhoni: తన ఇన్ స్టా ఖాతాలో కేవలం నలుగురినే ఫాలో అవుతున్న ధోని.. వారెవరో మీకు తెల్సా..?
Dhoni
Follow us on

Dhoni Instagram: ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్. దేశానికి ఎన్నో అపూర్వ విజయాలు అందించిన వ్యక్తి. ధోనికి ఉన్న ఫ్యాన్ బేస్ అనంతం. 2004లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని.. దాదాపు 16 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. మిస్టర్ కూల్, ఝూర్ఖండ్ డైనమేట్, తల… ఇలా రకరకాల పేర్లతో ధోనిని పిలుచుకుంటారు ఫ్యాన్స్. ధోని క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు.. జనాల అరుపులు చెబుతాయి.. అతడు ఎంతటి అభిమానాన్ని చూరగొన్నాడో. కెప్టెన్‎గా, బ్యాటర్‎, వికెట్ కీపర్‎గా అతడు అందించిన సేవలు వెలకట్టలేనివి. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అయితే ఐపీఎల్ ద్వారా మాత్రం ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు. కాగా చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే ధోనికి.. ఇన్ స్టాలో 39.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం కేవలం 4 నలుగురిలో ఫాలో అవుతున్నారు. అవును.. తన భార్య సాక్షి, కూతురు జీవా, లెజండరీ యాక్టర్ అమితాబచ్చన్‌తో పాటు తన కూరగాయల పామ్  ‘ఈజా ఫామ్స్’ ఖాతాను ఫాలో అవుతున్నాడు ధోని.

కాగా గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో అటు ఆర్మీలో కూడా పనిచేస్తున్నారు. ప్రజంట్ తన ఫామ్‌లో  కూరగాయలు పండించడంతో పాటు కడక్ నాథ్ కోళ్లను పెంచుతూ సేదతీరుతున్నాడు. వచ్చే ఐపీఎల్‌లో ధోని చెన్నై తరఫున బరిలోకి దిగుతాడని ఆ టీమ్ వర్గాలు ధృవీకరించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..