Viral: నదీ తీరం ఒడ్డున మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటని చూడగా కళ్లు జిగేల్.!

నదీ తీరం ఒడ్డున ఓ వ్యక్తి జాగింగ్ చేస్తుండగా.. అతడికి మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది...

Viral: నదీ తీరం ఒడ్డున మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటని చూడగా కళ్లు జిగేల్.!
Representative Image
Follow us

|

Updated on: Aug 11, 2022 | 1:26 PM

సముద్రంలో ఎన్నో రహస్యాలను తనలో దాచుకుంటుంది. ఇందుకు నిదర్శనంగా ఇజ్రాయిల్‌లో ఓ ఘటన చోటు చేసుకుంది. నదీ తీరం ఒడ్డున ఓ వ్యక్తి జాగింగ్ చేస్తుండగా.. అతడికి మెరుస్తున్న వస్తువు ఒకటి కనిపించింది. ఏంటని దగ్గరకెళ్లి చూడగా కళ్లు జిగేల్‌మన్నాయి. అదొక అరుదైన నాణెం. ఇంతకీ అది ఏ కాలం నాటిది.? దాని హిస్టరీ ఏంటి.? అనేది తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల హైఫా నదీ తీరం ఒడ్డున ఇజ్రాయిల్‌కు చెందిన పురావస్తు శాఖ పరిశోధకుడికి రోమన్ మూన్ దేవత లూనా ముద్రించబడిన 1850వ సంవత్సరం నాటి కాంస్య నాణెం ఒకటి దొరికింది. ఒకవైపు నాణెం మీద మూన్ దేవత లూనా, స్కార్పియోన్ చిత్రాలు ముద్రించబడి ఉండగా.. మరోవైపు రోమన్ చక్రవర్తి ఆంటోనినస్ పియస్(138-161 CE) తల ముద్రించబడింది. ఈ నాణెం అతడి పాలనలో చలామణీ అయ్యి ఉండొచ్చునని ఇజ్రాయిల్ పురాతన వస్తువుల అథారిటీ సిబ్బంది వెల్లడించింది.

ఇజ్రాయెల్ నదీ తీరంలో ఇలాంటి నాణెం దొరకడం ఇదే తొలిసారి అని ఆ యూనిట్ డైరెక్టర్ జాకబ్ షర్విత్ తెలిపారు. ఇది నేషనల్ ట్రెజర్స్ సేకరణలో ఓ అరుదైన కలెక్షన్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇలాంటి అరుదైన నాణేలు ఎన్నో వేల సంవత్సరాల క్రితం సముద్రంలో కొట్టుకుపోయాయని.. వాటిల్లో కొన్ని దేశ గత చరిత్రను ప్రతిబింబిస్తాయని ఆయన చెప్పారు.

కాగా, ఈ నాణెం 13 నాణేల శ్రేణికి చెందినదిగా.. ఆ సిరీస్‌లో 12 నాణేలు పన్నెండు రాశిచక్రాలను ప్రతిబింబిస్తే.. 13వ నాణెం పూర్తి రాశిచక్రాన్ని సూచిస్తుందని నాణేన్ని గుర్తించిన పరిశోధకుడు పేర్కొన్నాడు. అంతేకాదు ఈ నాణెం ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో ముద్రించబడినదిగా.. ఆంటోనినస్ పయస్ పాలనలోని ఎనిమిదో ఏడాది సమయంలో వాడుకలోకి వచ్చిందని చెప్పాడు.

Rare Coin

 

ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
ఆగిపోయిన ప్రభాస్ మరో సినిమా! డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు