
చైనాలోని మకావులో ఉన్న ప్రసిద్ధ గ్రాండ్ ఎంపరర్ హోటల్ అత్యంత ఖరీదైన,విలాసవంతమైనది. గతంలో దాని లగ్జరీ లాబీ గ్రౌండ్ఫ్లోర్ కింద కిలోల బరువైన బంగారు ఇటుకలతో నిర్మించి బడి ఉంది. కానీ, ఇప్పుడు, హోటల్ దాదాపు ఆ బంగారు ఇటుకలన్నింటినీ వెలికితీసి విక్రయించింది. మకావు చైనా గేమింగ్ రాజధానిగా పిలువబడుతుంది. క్యాసినోలు చట్టబద్ధంగా ఉన్న ఏకైక ప్రదేశం ఇదే. కానీ, బీజింగ్ ప్రభుత్వం ఇటీవల ఆర్థిక వైవిధ్యీకరణ కోసం ఒత్తిడి చేస్తోంది. స్థానిక నిబంధనలు కఠినతరం కావడంతో అనేక క్యాసినోలు మూసివేయబడుతున్నాయి. కాబట్టి, గ్రాండ్ ఎంపరర్ హోటల్ కూడా గత అక్టోబర్లో దాని క్యాసినో కార్యకలాపాలను నిలిపివేసింది. ఇప్పుడు ఇతర రకాల వినోదాలపై దృష్టి సారించింది.
2006లో ప్రారంభమైన గ్రాండ్ ఎంపరర్ హోటల్, దాని ప్రవేశద్వారం వద్ద గాజు కింద అమర్చబడిన అనేక నాణ్యమైన బంగారు ఇటుకలతో పర్యాటకులను ఆకర్షించేది. కానీ, ఇటీవలి మార్కెట్ పరిస్థితి బంగారాన్ని అమ్మడానికి గొప్ప అవకాశమని హోటల్ యాజమాన్యం విశ్వసిస్తోంది. హోటల్ ప్రవేశ ద్వారం వద్ద గాజు కింద ఏర్పాటు చేసిన ఇటుకలు మొత్తం 79 కిలోల బరువు కలిగి ఉన్నాయి. వాటిని హాంకాంగ్ రిఫైనర్కు విక్రయించారు. ఈ లావాదేవీ కంపెనీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని, భవిష్యత్ పెట్టుబడులకు సహాయపడుతుందని కంపెనీ తెలిపింది. ఈ ఇటుకలను అమ్మడం ద్వారా హోటల్ యాజమాన్యం దాదాపు $13 మిలియన్లు (సుమారు రూ.117 కోట్లు) సంపాదించినట్టుగా సమాచారం.
బంగారం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును హోటల్ కొత్త సౌకర్యాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అప్గ్రేడ్ చేయడానికి ఉపయోగించనున్నట్లు సమాచారం. ఆధునిక డిజైన్, డిజిటల్ వినోదం, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్ అనుభవాలను మరింత మెరుగుపరచడానికి ప్రణాళికలు చేస్తున్నారు. విలాసానికి చిహ్నంగా ఉన్న గోల్డెన్ పాత్ ఇప్పుడు లేనప్పటికీ, హోటల్ మరోసారి కొత్త థీమ్ ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తుందని నిర్వహణ బోర్డు నమ్మకంగా ఉంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..