ఈ ఆలయంలో ఎలుకలకు మొదటి నైవేద్యం… అవి తినగా మిగిలిందే భక్తులకు ప్రసాదం..

ఎలుక దేవాలయంలో అడుగు తీసి అడుగు వేయాలంటే.. ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలిన..ఎక్కడ కాలుపెడితే అక్కడ ఎలుకలే తగులుతుంటాయి... వాటికి ఎలాంటి హానీ చేయకుండా, కాలు తగలకుండా చూసుకోవాలి. ఈ ఆలయంలో భగవంతుడి కంటే ముందుగా ఎలుకలకు నైవేధ్యం పెడతారు. ఇక అవి తినగా మిగిలిన ఆహారం మాత్రమే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు.

ఈ ఆలయంలో ఎలుకలకు మొదటి నైవేద్యం... అవి తినగా మిగిలిందే భక్తులకు ప్రసాదం..
Karni Mata Temple

Updated on: Sep 06, 2023 | 1:32 PM

భారతదేశంలో అనేక మతపరమైన ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కో ఆలయం, క్షేత్రానికి సబంధించి వాటి చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటి ప్రదేశమే కర్ణిమాత మందిరం. ఈ పుణ్యక్షేత్రం దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. తన అందాలతో పర్యాటకుల మనసును ఆకర్షించడంలో రాజస్థాన్ ఎప్పుడూ ముందుంటుంది.. ప్రకృతి అందాలు, కళలు, రాయల్ లుక్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే వేసవిలో ఇక్కడికి రావాలంటేనే భయపడుతున్నారు. విపరీతమైన ఎండల కారణంగా ఇక్కడ నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే, రాజస్థాన్ దాని మతపరమైన ప్రదేశాలకు పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎలుకతో సంబంధం ఉన్న ఆలయం ఒకటి ఉంది.

అవును, కర్ణి మాత ఆలయం రాజస్థాన్‌లోని బికనీర్‌లో ఉంది.  దీని ప్రత్యేకత ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే..ఈ ఆలయంలో భగవంతుడి కంటే ముందుగా ఎలుకలకు నైవేధ్యం పెడతారు. ఇక అవి తినగా మిగిలిన ఆహారం మాత్రమే భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఇలాంటి విచిత్ర ఆచారం ఉన్న ఆలయం రాజస్థాన్‌లోని బికనీర్‌లోని కర్ణి మాత ఆలయం..ఇది ఎప్పుడూ పర్యాటకుల రద్దీతో చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం కర్ణి దేవికి అంకితం చేయబడింది.  ఎలుకల కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఆలయం బాగా ప్రాచుర్యం పొందింది. ఇక్కడ ఎలుకలను భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. అయితే ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

అవును,  కర్ణి మాత ఆలయాన్ని 20వ శతాబ్దంలో బికనీర్ మహారాజా గంగా సింగ్ నిర్మించారు. ఈ ఆలయం చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రధాన ద్వారం వెండితో చేయబడింది. కర్ణి మాత కోసం బంగారు గోపురం నిర్మించారు. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ 20 వేలకు పైగా ఎలుకలు తిరుగుతుంటాయి. వాటికి పూజలు చేసిన తర్వాత నైవేద్యాలు సమర్పిస్తారు భక్తులు. అంతేకాదు ఇక్కడ కొన్ని తెల్ల ఎలుకలు కూడా కనిపిస్తాయి. ఈ ఎలుకలను దేవాలయంలో చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ ఎలుకలను భక్తులు కాబా అని కూడా పిలుస్తారు. అంతేకాదు..ఈ ఆలయంలో ఎలుకల వెండి విగ్రహాలను పూజిస్తారు.

ఇవి కూడా చదవండి

కర్ణి మాత మందిరాన్ని బికనీర్ రాయల్టీ కుల్దేవి అని పిలుస్తారు. ఇక్కడ నివసించే తెల్ల ఎలుకలను తల్లి వాహనాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని ఇలి టెంపుల్ అని కూడా అంటారు. ఇక్కడ సుమారుగా 20 వేలకు పైగా ఎలుకలు తిరుగుతుంటాయి. అందులో కొన్ని తెల్ల ఎలుకలు కూడా ఉన్నాయి. ఇక్కడి వచ్చే భక్తుడు మరణిస్తే కర్ణి మాత ఆలయంలో ఎలుకగా పుడతాడని నమ్ముతారు.

రాజస్థాన్‌లోని బికనీర్ నుండి దాదాపు 30 కి.మీ. దేశ్‌నోక్‌లోని ఈ ఆలయాన్ని ఎలుకల తల్లి, ఎలుకల ఆలయం, మూషక్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఎలుకలను కాబా అంటారు. ఎలుక దేవాలయంలో అడుగు తీసి అడుగు వేయాలంటే.. ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకోవాలిన..ఎక్కడ కాలుపెడితే అక్కడ ఎలుకలే తగులుతుంటాయి… వాటికి ఎలాంటి హానీ చేయకుండా, కాలు తగలకుండా చూసుకోవాలి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us