AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారేవ్వా భలే ఐడియా.. ఆఫీసులో రోజూ గంట పిక్నిక్ అవర్ తప్పనిసరి.. బాస్ నిర్ణయానికి నెటిజన్లు ఫిదా!

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సాఫ్ట్‌వేర్ లేదా ఇతర కార్పొరేట్ ఉద్యోగులు పని ఒత్తిడితో (Work Stress) సతమతమవుతున్నారు. ఉదయం కంపెనీలోకి అడుగుపెట్టినప్పటి నుండి సాయంత్రం బయటకు వచ్చేవరకు కంప్యూటర్ల ముందే కాలం గడిపేస్తుంటారు. అయితే, ఈ 'వర్క్ కల్చర్'కు స్వస్తి పలుకుతూ ఒక కంపెనీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

వారేవ్వా భలే ఐడియా.. ఆఫీసులో రోజూ గంట పిక్నిక్ అవర్ తప్పనిసరి.. బాస్ నిర్ణయానికి నెటిజన్లు ఫిదా!
Picnic Hour
Jyothi Gadda
|

Updated on: May 01, 2026 | 7:36 PM

Share

ఈ రోజుల్లో కంపెనీలు తమ ఉద్యోగుల నుండి ఎక్కువ పని రాబట్టడంపై దృష్టి సారిస్తుండగా, ఒక భారతీయ స్టార్టప్ మాత్రం పూర్తిగా భిన్నమైన పద్ధతిని ఎంచుకుంది. సాధారణంగా ఆఫీసుల్లో లంచ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. కానీ, ఈ కంపెనీ తమ ఉద్యోగుల కోసం ప్రతిరోజూ ఒక గంట పాటు ‘పిక్నిక్ అవర్’ (Picnic Hour)ను ప్రవేశపెట్టింది. ఇది ఐచ్ఛికం కాదు, అందరూ తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ గంట సమయంలో ఎవరూ పని చేయకూడదు, కేవలం సహోద్యోగులతో సరదాగా గడపాలి. ఇందులో బాస్ నుండి కొత్త ఉద్యోగి వరకు అందరూ కలిసి భోజనం చేస్తారు. ఈ విలక్షణమైన చొరవ సోషల్ మీడియాలో అందరి మనసులను గెలుచుకుంది.

ఈ ఇండియన్ స్టార్టప్ విలక్షణమైన పని సంస్కృతి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశం అవుతోంది. ఆ కంపెనీ వ్యవస్థాపకురాలు, కావ్య కర్ణాటక్ తన బృందం కోసం ప్రతిరోజూ ఒక గంట ఆఫీస్ పిక్నిక్‌ను తప్పనిసరి చేశారు. కేకే క్రియేట్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలు కాగానే, ఉద్యోగులందరూ తమ పనిని వదిలిపెట్టి భోజనం చేయడానికి ఒకచోట గుమిగూడతారు. ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే, ఈ సమయంలో ఎవరూ ఒంటరిగా భోజనం చేయరు. అందరూ వివక్ష లేకుండా కలిసి కూర్చుంటారు.

ఇవి కూడా చదవండి

ఈ పిక్నిక్ సమయంలో పదవులు, హోదాలకు ప్రాధాన్యత ఉండదు. మేనేజర్లు, సీనియర్లు, కొత్త ఉద్యోగులు అందరూ కలిసి కూర్చుంటారు. స్థలం పరిమితంగా ఉంటే, అందరూ కలిసి సమయం గడపడానికి కుర్చీలు వేసుకుని, మూలల్లో కూర్చుంటారు. లేదా నిలబడతారు కూడా. కంపెనీ వ్యవస్థాపకుడి ప్రకారం, ఇది కేవలం భోజనం చేసే సమయం మాత్రమే కాదు, జట్టు సంబంధాలను బలోపేతం చేసుకునే ఒక అవకాశం కూడా. ఈ గంట కేవలం తినడానికే కాదు, నవ్వులు, ఆటలు, సంభాషణలకు కూడా కేటాయించారు. కొందరు ఇంట్లో వండిన భోజనాన్ని పంచుకుంటే, మరికొందరు సరదా జోకులు చెప్పుకుంటారు. కొన్నిసార్లు, ప్రజలు ఫన్నీ గేమ్స్‌ కూడా ఆడతారు. కొన్నిసార్లు ఈ విరామం గంటకు పైగా కొనసాగుతుందని, ఆఫీసు వాతావరణం ఒక పార్టీలా మారిపోతుందని వ్యవస్థాపకుడు చెబుతారు.

View this post on Instagram

A post shared by Flash Fuze (@flashfuze)

కంపెనీ మేనేజ్‌మెంట్ అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ ఇలా గంట పాటు అందరూ కలిసి పిక్నిక్ లాగా గడపడం వల్ల ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ పెరుగుతుంది. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. పని మధ్యలో విరామం దొరకడం వల్ల ఉద్యోగులు రీఛార్జ్ అవుతారు. టీమ్ బాండింగ్ ఏర్పడుతుంది. వివిధ విభాగాల వారు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా మెరుగైన ఉత్పాదకత లభిస్తుంది. సంతోషంగా ఉండే ఉద్యోగులు పనిలో మెరుగైన ఫలితాలు ఇస్తారని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us