Viral: ఇది భారత రైల్వేస్టేషనే.. కానీ ఇక్కడికి వెళ్లాలంటే వీసా కావాల్సిందే..

|

Aug 29, 2024 | 12:59 PM

ఈ రైల్వే స్టేషన్‌లో పటిష్ఠమైన భద్రత ఉంటుంది. నిరంతరం ఆర్మీ గస్తీ కాస్తూ ఉంటుంది. ఈ అట్టారి రైల్వే స్టేషన్ నార్తర్న్ రైల్వే జోన్‌లో ఉండగా.. ఈ స్టేషన్ నిర్వహణను ఫిరోజ్‌పూర్ డివిజన్ పర్యవేక్షిస్తుంటుంది. ఎవరైనా ఈ వీసా, పాస్‌పోర్టు లేకుండా అక్కడికి వెళ్తే అధికారులు పట్టుకుని చర్యలు తీసుకుంటారు.

Viral: ఇది భారత రైల్వేస్టేషనే.. కానీ ఇక్కడికి వెళ్లాలంటే వీసా కావాల్సిందే..
Attari Railway Station
Follow us on

మాములుగా వేరే కంట్రీస్‌కు వెళ్లాలంటే వీసా, పాస్‌పోర్ట్ వంటివి అవసరమవుతాయి. దేశం పరిధిలో ఎక్కడికి వెళ్లాలన్నా పాస్‌పోర్టులు, వీసాల వంటివి నీడ్ ఉండదు. అయితే మన దేశంలోని ఈ రైల్వే ష్టేషన్ మాత్రం అందుకు మినహాయింపు. భౌగోళికంగా ఆ ప్రాంతం మనదేశంలోనే స్టేషన్ ఉన్నా.. మన పౌరులు కూడా అక్కడి వెళ్లాలంటే పాస్‌పోర్టుతోపాటు పాకిస్థాన్ వీసా కూడా తప్పనిసరి. ఆ ప్లేస్ ఏంటి అంటే.. అట్టారీ రైల్వే స్టేషన్. పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్ జిల్లాలో ఈ అట్టారి రైల్వే స్టేషన్ ఉంది.

ఈ అట్టారీ రైల్వే స్టేషన్ భారత్, పాకిస్థాన్ దేశాల బోర్డర్‌లో ఉంది ఈ రైల్వే స్టేషన్‌ను అట్టారి శ్యామ్ సింగ్ రైల్వే స్టేషన్ అని కూడా సంభోదిస్తారు. అయితే ఇది భారత్, పాక్‌ బోర్డర్‌లో ఉన్న అత్యంత సున్నితమైన ప్రదేశం. ఇరు దేశాల సరిహద్దుల్లోని అట్టారి – వాఘా బోర్డర్ ఏరియాలో ఈ రైల్వేస్టేషన్ ఉంది. అట్టారి భారత్‌ భూబాగంలో ఉండగా.. వాఘా అనేది పాకిస్థాన్‌లోని ప్రాంతం. అందుకే ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలంటే పాకిస్థాన్ వీసా తప్పనిసరి చేశారు.  అట్టారి స్టేషన్ నార్త్ రైల్వేలోని ఫిరోజ్‌పూర్ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో సైన్యం పహారా కాస్తూ ఉంటుంది. గతంలో భారత్, పాక్ మధ్య.. ఈ స్టేషన్ ద్వారా.. సంజౌతా ఎక్స్‌ప్రెస్ నడిచేది.  భారత్, పాకిస్థాన్ మధ్య శాంతియుత సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో.. దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అట్టారి వాఘా బోర్డర్‌లో ఇరు దేశాల సైనికులు అనుక్షణం గస్తీ కాస్తూనే ఉంటారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..