మార్మోగిన రామనామం.. వెయ్యికి పైగా బిస్కెట్లతో రామమందిరం.. వీడియో వైరల్.!

అయోధ్య రాముని గురించి భక్తులు అనేక రకాలుగా వేడుకుంటున్నారు. రాముని కోసం ఏదో చేయాలనే ఆలోచనతో పార్లే-జీ, మ్యారీగోల్డ్ బిస్కెట్లను 1000కి పైగా ఉపయోగించి.. 3 రోజులు శ్రమించి భక్తితో మందిరాన్ని తయారు చేశారు.

Edited By:

Updated on: Jan 20, 2024 | 1:45 PM

అయోధ్య రాముని గురించి భక్తులు అనేక రకాలుగా వేడుకుంటున్నారు. రాముని కోసం ఏదో చేయాలనే ఆలోచనతో పార్లే-జీ, మ్యారీగోల్డ్ బిస్కెట్లను 1000కి పైగా ఉపయోగించి.. 3 రోజులు శ్రమించి భక్తితో మందిరాన్ని తయారు చేశారు. రామకోటి కార్యాలయంలో గురువారం నాడు ఆవిష్కరించి రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాముని గురించి ఎన్నో చిత్రాలు చిత్రించానని ఈసారి రాముని గురించి మందిరాన్ని చేశానన్నారు. రామ నామాన్ని మించిన నామం మరొక్కటి లేదన్నారు. నేడు భారతదేశం అంతా కూడా రామనామంలో మునిగి తేలడం రామభక్తికి నిదర్శనం అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us