రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..

|

May 18, 2021 | 7:13 PM

Viral Video: ఇటీవల కాలంలో గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయనే సంఘటనలు వింటూనే ఉన్నాం. ఎప్పుడూ ఎక్కడి నుంచి ఏనుగుల గుంపు ఊర్లోకి వస్తుందో

రోడ్డు మధ్యలో ఏనుగు.. అప్పుడే బైక్ పై వచ్చిన యువకుడు.. అంతలోనే ఊహించని ఘటన.. చివరకు..
Viral
Follow us on

Viral Video: ఇటీవల కాలంలో గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశిస్తున్నాయనే సంఘటనలు వింటూనే ఉన్నాం. ఎప్పుడూ ఎక్కడి నుంచి ఏనుగుల గుంపు ఊర్లోకి వస్తుందో అని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. గత కొన్ని రోజులుగా పంట పొలాలపై ఈ ఏనుగుల గుంపులు దాడి చేసి పంటలను నాశనం చేస్తున్నాయి. అయితే కొన్ని సార్లు ఏనుగులు మనుషులు కనిపించిన ఏం చేయకుండా వదిలిపెట్టేస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో… రహదారిపై అడ్డుగా పెద్ద ఏనుగు నిల్చోని ఉంది. దీంతో ఆ దారి వెంట వెళ్లాల్సిన వారు అక్కడే ఆగిపోయారు. కానీ ఆ ఏనుగు మాత్రం ఎక్కడికి వెళ్ళకుండా అలాగే రోడ్డుపై నిల్చోని ఉంది. ఇక అదే సమయంలో అటుగా ఓ వ్యక్తి స్కూటీపై వచ్చాడు. ఏనుగు ముందు నుంచి వెళ్ళపోతూ.. ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ వ్యక్తి పడిపోయిన కానీ ఏనుగు అతడి దగ్గరికి రాకుండా అక్కడే నిల్చోని నెమ్మదిగా అతడిని చూస్తూ ఉంది. ఇక పడిపోయిన వ్యక్తి లేచి నెమ్మదిగా తన స్కూటీని పక్కకు తీసుకోని వెళ్లి తనకు తగిలిన గాయాలను చూసుకున్నాడు. ఇంత జరిగిన ఆ ఏనుగు మాత్రం అతడినికి ఎలాంటి హాని చేయకుండా అక్కడే నిల్చోని చూసింది. ఈ సంఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… ఆ ఏనుగు ఏం ఆలోచిస్తోంది ? ఏవరైనా చెప్పగలరా ? అంటూ ట్విట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ వీడియోను 72,000 మంది వీక్షించారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమ స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..

ట్వీట్..

Also Read: నెటిజన్లపై మండిపడ్డ రేణు దేశాయ్.. పిచ్చి పిచ్చి మెసేజీలు ఆపండి.. మిగతవాళ్ళ ప్రాణాలు పోతున్నాయ్ అంటూ ఫైర్..

మనుషులకు పోటీ ఇస్తున్న కోతి.. ఈ మంకీ చేసే పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..