వేసవి నేపథ్యంలో నీటి కొరత తీవ్రమవుతోంది. ఈ మండు వేసవిలో తాగునీటి సమస్య ఒకవైపు ఉండగా, వ్యవసాయ పనులకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు నీటి సమస్య పరిష్కారానికి బోరు బావులను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా ఇప్పుడు అడుగంటాయి. మోటారు వేసినా నీరు రావడం లేదు. దీంతో గంగమ్మకు మొక్కి కొత్త బోర్లు వేయిస్తున్నారు. అయితే ఎన్ని అడుగులు లోనికి వెళ్లినా నీటి జాడ చిక్కడం లేదు. కొత్త బోర్వెల్ వేసినా ఒక్క చుక్క నీరు కూడా పడటం లేదు. కానీ వైరల్ అవుతున్న వీడియోలో రైతు పొలంలో వేయించిన బోరు బావిలో నీరు ఉబికి వచ్చింది. ఆ గంగను చూసి సదరు రైతు ఉప్పొంగిపోయి తోటి రైతును కౌగిలించుకున్న వీడియో ప్రజంట్ నెట్టింట వైరల్ అవతుంది.
వైరల్ వీడియోలో, ఒక రైతు వ్యవసాయానికి నీటి కొరత కారణంగా బోర్ వేయించే ప్రయత్నం చేశాడు. అందరికీ అన్నం పెట్టే రైతు కోరితే గంగమ్మ వినకుండా ఉంటుందా చెప్పండి. కొన్ని అడుగులు వేయగానే బోరు గుండా నీటి ధార ఎగజిమ్మింది. ఫౌంటెన్ లాగా నీరు బయటకు తన్నుకు వచ్చింది. ఇది చూసిన రైతు ఆనందంగా డ్యాన్స్ చేశాడు. ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ నీటి కొరత నేపథ్యంలో ప్రజంట్ మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. శ్రీనివాస బోర్వెల్స్ అనే అకౌంట్ నుంచి ఈ వీడియోను ఇన్ స్టాలో షేర్ చేశారు. “ఈ సంతోషం ఎన్ని కోట్లు పెట్టిన రాదు” అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. “ఆ ఆనందం ఆయన కడుపు నింపుకోవడానికి కాదండి ఒక పదిమందికి కడుపునిండా అన్నం పెట్టడానికి” అని మరొకరు పేర్కొన్నారు. ఆ వైరల్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..