కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం

చైనాకి చెందిన టిక్‌టాక్ యాప్.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రూ.1900 కోట్లు విరాళం ప్రకటించింది. కరోనా మహమ్మారితో ఎక్కువగా ప్రభావితమైన వారి కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు..

కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 5:52 PM

కరోనాను ఎదుర్కోవడాన్ని.. ప్రపంచ దేశాలు సవాలుగా తీసుకుని పోరాటం చేస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ని విధించాయి. అయినప్పటికీ ఈ వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వ్యాక్సిన్ లేని ప్రాణాంతక వ్యాధి కావడంతో వైద్యులు, శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తూ తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. వీరికి అండగా, ప్రజల రక్షణకై పలు కంపెనీలు, ప్రముఖులు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తున్నారు.

అలాగే చైనాకి చెందిన టిక్‌టాక్ యాప్.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం రూ.1900 కోట్లు విరాళం ప్రకటించింది. కరోనా మహమ్మారితో ఎక్కువగా ప్రభావితమైన వారి కోసం ఈ నిధులు ఇస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా ఇతర సంస్థల ద్వారా భారత్, ఇటలీ వంటి దేశాల్లో వైద్య సేవల కోసం రూ.1,140 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. కాగా.. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు తమ వంతు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని టిక్‌టాక్ అధ్యక్షుడు అలెక్సా జూ తెలిపారు. అలాగే ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ సహా ఇతర సామాజిక మాధ్యమ సంస్థలు విరాళాలు ప్రకటించగా తాజాగా టిక్‌టాక్ వాటి సరసన చేరింది.

ఇవి కూడా చదవండి:

కరోనా వ్యాప్తి: కరెన్సీ వద్దు.. డిజిటల్ చెల్లింపులే చేయండి..

కరోనా ఇంపాక్ట్‌కి వంద మంది వైద్యులు మృతి

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..

తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. 17 రకాల వస్తువులతో కిట్.. పూర్తిగా ఫ్రీ

సీఎం కొత్త నిర్ణయం.. విలేజ్, వార్డు క్లీనిక్స్ ఏర్పాటు..