సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయొద్దు!

TV9 Telugu

21 April 2024

ఎఫ్‌బీ పోస్ట్‌లు, ఎక్స్(ట్విటర్‌)లో కామెంట్లు, ఇన్‌స్టాలో ఫాలో అయ్యే పేజీలు.. ఇలా వ్యక్తిగత ఇంట్రెస్ట్‌లను బట్టి వాళ్లేంటో ఇట్టే పసిగట్టే రోజులివి.

కంటికి కనిపించని రక్కసి లాంటి సోషల్ మీడియా వలలో చిక్కకూడదంటే కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాటించాల్సిందే.

సోషల్‌ మీడియాలో చేసే పోస్ట్ అయినా, కామెంట్ అయినా.. ఒక్కసారి ఫోన్ దాటితే నిముషాల్లో ప్రపంచమంతా వైరల్ అవ్వొచ్చు.

ఏదైనా పోస్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం అవసరం. పర్సనల్ విషయాలను అతిగా షేర్‌ చేయకపోవడమే మంచిది.

వ్యక్తిగత విషయాలను ఇతరుల పసిగట్టడం వల్ల పలు సమస్యలు తలెత్తొచ్చు. ఒక తప్పుడు వార్త కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలు కూడా తీయొచ్చు.

నిజానిజాలు నిర్ధారించుకోకుండా ఏ పోస్టు చేయొద్దు. విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టుల వల్ల చాలా ఇబ్బందులుంటాయి.

ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టే వైరల్ వార్తలు నిజమైనవా? లేదా ఫేక్ న్యూసా? అన్నది తెలుసుకునేందుకు ‘ఫ్యాక్ట్‌లీ’, ‘బూమ్‌లైవ్’ వంటి వెబ్‌సైట్స్ చూడొచ్చు.

మెసేజింగ్‌ యాప్స్‌లో పర్సనల్ విషయాలు చర్చిస్తుంటారు. కాబట్టి ఆ యాప్స్‌కు ‘ఎండ్‌ టు ఎండ్‌’ ఎన్‌స్క్రిప్షన్‌ ఉందో లేదో చూసుకోవాలి.

మెసేజింగ్ యాప్స్ లాగిన్‌ చేసేందుకు టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ పెట్టుకోవాలి. అన్ని సోషల్‌ మీడియా అకౌంట్లకు ఒకే పాస్‌వర్డ్‌ కాకుండా వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలి.

అనుమతి లేకుండా మిమ్మల్ని ట్యాగ్‌ చేస్తే వెంటనే ట్యాగ్ రిమూవ్ చేయాలి. అలాగే సెట్టింగ్స్‌లోకి వెళ్లి ట్యాగ్గింగ్ పర్మిషన్స్ ఆప్షన్ మార్చుకోవాలి.