ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ఏటీఎంలు.. కానీ ప్లాన్ ఫెయిల్

ఓ ఏటీఎం దగ్గరకు వెళ్లిన దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఏటీఎంను దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్‌ మోగడంతో ఇంకోచోటకు పరుగుల పెట్టారు. అక్కడా సేమ్‌ సీన్‌.. ఏటీఎంను పగలగొట్టేందుకు చూడగా..

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ఏటీఎంలు.. కానీ ప్లాన్ ఫెయిల్
Follow us

|

Updated on: Oct 01, 2020 | 1:41 PM

కర్నూలులో దొంగలు రెచ్చిపోతున్నారు. కాస్తా అదను దొరికితే చాలు దోచుకుంటున్నారు. అయితే ఇళ్లను టార్గెట్ చేయకుండా భారీ దొంగతనాలకు దొంగలు ప్లాన్ చేస్తున్నారు. గత నెలలో భారీ కంటైనర్‌ లారీని ఎత్తుకెళ్లిన సంఘటన తెలిసిందే. ఇప్పుడు తాజాగా కర్నూలు జిల్లాలో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు ఏటీఎంలను దోచుకునేందుకు ప్రయత్నించారు.

ముందుగా ఓ ఏటీఎం దగ్గరకు వెళ్లిన దొంగలు దోపిడీకి ప్రయత్నించారు. అయితే ఏటీఎంను దోచుకునేందుకు ప్రయత్నిస్తుండగా సైరన్‌ మోగడంతో ఇంకోచోటకు పరుగుల పెట్టారు. అక్కడా సేమ్‌ సీన్‌.. ఏటీఎంను పగలగొట్టేందుకు చూడగా.. సైరన్‌ మోగింది. అంతే.. అక్కడినుంచి పరారయ్యారు. తర్వాత ఇంకోచోట.. ఇలా మొత్తం నాలుగు ఏటీఎంలను కొల్లగొట్టేందుకు చూశారు. అయితే ఇదంతా జరిగింది కేవలం ఒక రాత్రిలోనే.

చోరీకి పక్కా ప్లాన్ చేసిన దొంగలు.. ఏదో ఒక క్లూను మాత్రం వదిలిపోతారు. వాటి ఆదారంగానే పోలీసులు వారిని ఇట్టే పట్టేస్తారు. ఈ ఘటనలో కూడా దొంగలు ఓ ఆదారం వదిలిపోయారు. దొంగలు ఏటీఎంలలో చోరీ చేయాలనుకున్న దృశ్యాలన్నీసీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. అయితే ఓ ఏటీఎం వద్ద చోరీకి ప్రయత్నిస్తుండగా మాత్రం దొంగ ఫేస్‌కి మాస్క్‌ లేకుండా కనిపించాడు. పోలీసులు ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.