YS Sharmila: కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు.. సంచలన ప్రకటన చేసిన షర్మిల

|

Nov 03, 2023 | 12:53 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన వేళ.. వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన నిర్ణయ తీసుకున్నారు. ఈ ఎన్నికల్లోతమ పార్టీ పోటీ చేయడం లేదని.. కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదన ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని.. రాష్ట్ర ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. తన నిర్ణయంతో ఏకీభవించని పార్టీ నేతలు..తనను క్షమించాలని కోరారు వైఎస్ షర్మిల. పాలేరు ప్రజల కూడా అర్థం చేసుకోవాలని భావోద్వేగానికి లోనయ్యారు.

YS Sharmila: కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు.. సంచలన ప్రకటన చేసిన షర్మిల
Ys Sharmila
Follow us on

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు – పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో తాము కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ఇస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. తెలంగాణలో కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందని తెలిపారు. వ్యతిరేక ఓటు చీలితే కేసీఆర్‌ తిరిగి సీఎం అవుతారని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో BRS తిరిగి అధికారంలోకి రాకుండా చూసేందుకు కాంగ్రెస్‌ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు షర్మిల వెల్లడించారు. గెలిచే అవకాశాలున్నాయి, ఈ పరిస్థితుల్లో అడ్డుపడొద్దని కాంగ్రెస్‌ పార్టీ తనను కోరిందని షర్మిల అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి