Hyderabad: నిలోఫర్‌లో నర్స్‌గా మారిన ఆయా.. ఇంజెక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు మృతి

Hyderabad: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital )లో దారుణ ఘటన జరిగింది. నీలోఫర్ లో ఇంజక్షన్‌లు(Injections) వికటించి ఇద్దరు పసిగుడ్లు ప్రాణాలు వదిలిన వార్త ఇప్పుడు..

Hyderabad: నిలోఫర్‌లో నర్స్‌గా మారిన ఆయా.. ఇంజెక్షన్ వికటించి ఇద్దరు చిన్నారులు మృతి
Niloufer Hospital Hyderabad

Updated on: Mar 02, 2022 | 11:18 AM

Hyderabad: హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రి(Niloufer Hospital )లో దారుణ ఘటన జరిగింది. నీలోఫర్ లో ఇంజక్షన్‌లు(Injections) వికటించి ఇద్దరు పసిగుడ్లు ప్రాణాలు వదిలిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తమ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం.. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కాకుండా ఆస్పత్రిలో పనిచేసే ఆయాలు ఇంజక్షన్లు చేస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నర్స్ కాకుండా ఆయా ఇంజెక్షన్ ఇవ్వడం వలెనే.. తమ పిల్లలు ఇంజక్షన్లు చేసిన క్షణాల్లోనే చనిపోయారంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు.

చిన్నారుల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం..తమకు న్యాయం చేయాలంటూ హాస్పటల్  వద్ద చిన్నారుల త‌ల్లిదండ్రులు, కుటుంబ స‌భ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఇబ్బంది అలర్ట్ అయింది. అయితే ఈ విషయంపై నిలోఫ‌ర్ వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకువ‌చ్చే స‌మ‌యానికే చిన్నారుల ఆరోగ్యం విష‌మించింద‌ని చెప్పారు. ప్రస్తుతం నిలోఫ‌ర్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. తాజా ఆరోపణలతో  ఆస్పత్రిలోని మిగతా పిల్లల తల్లిదండ్రుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

Also Read:

90 ఏళ్ల బామ్మకు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ఆమె ఆనందాన్ని చూస్తే మీ కంట కన్నీరు ఆగదు..

విన్‌జో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంఎస్ ధోని.. ఇండియాను గేమింగ్ పవర్‌హౌస్‌గా మార్చేస్తామంటూ ప్రకటన..

యూపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి మౌర్య కాన్వాయ్‌పై దాడి

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us