Telangana: పొత్తులపైనే కాంగ్రెస్ ఫోకస్.. జూపల్లితో చర్చించిన రేవంత్, కోమటిరెడ్డి.. పొంగులేటితోనూ..

Telangana Congress: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్‌ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఎప్పుడూ లేని విధంగా అంతా సమిష్టిగా ముందుకు అడుగులు వేస్తూ పలువురు నాయకులను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం జూపల్లి..

Telangana: పొత్తులపైనే కాంగ్రెస్ ఫోకస్.. జూపల్లితో చర్చించిన రేవంత్, కోమటిరెడ్డి.. పొంగులేటితోనూ..
Revanth Reddy, Komatireddy Venkat Reddy, Jupally Krishna Rao Press Meet

Updated on: Jun 21, 2023 | 3:01 PM

Telangana Congress: తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్ర కాంగ్రెస్‌ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఎప్పుడూ లేని విధంగా అంతా సమిష్టిగా ముందుకు అడుగులు వేస్తూ పలువురు నాయకులను పార్టీలోకి చేర్చుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే బుధవారం జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత జూపల్లి ఇంటికి చేరుకున్నారు. జూపల్లి కృష్ణారావుతో పార్టీలోకి చేరికపై చర్చించిన అనంతరం ముగ్గురు కలిసి పొంగులేటి శ్రీనివాసరావు దగ్గరకు వెళ్లనున్నారు.

అయితే జూపల్లితో చర్చించిన వీరు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ‘పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి, గుర్నాథ్ రెడ్డి, దామోదర్ రెడ్డి గతంలో బీఆరెస్‌లో చేరారు. తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదు. అందుకే వారంతా కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగరేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం అందుకే వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించడానికి వచ్చాం. తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే ఈ చేరికలు. ఈ చేరికలు తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకే. వీళ్లే కాదు.. ఇంకా చాలా మంది కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మంచి ముహూర్తంలో వీరంతా కాంగ్రెస్‌లో చేరుతారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయి’ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Loading...
Unable to load recommendations.
Follow Us