Telangana: అయ్యో పాపం.. ఆగి ఉన్న కారు ఆ చిన్నారి ప్రాణాలను మింగేసింది..!

| Edited By: Balaraju Goud

May 22, 2024 | 12:51 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్ళింది. కారు డోర్ లాక్ కావడంతో ఉపిరాడక తుదిశ్వాస విడిచింది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదం వెలుగు చూసింది. ఆడుకుంటూ వెళ్లి కారెక్కిన మూడేళ్ల చిన్నారి, కార్ డోర్స్ లాక్ అవడంతో మృతి చెందింది.

Telangana: అయ్యో పాపం..  ఆగి ఉన్న కారు ఆ చిన్నారి ప్రాణాలను మింగేసింది..!
Car Door Lock
Follow us on

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంతలోకాలకు వెళ్ళింది. కారు డోర్ లాక్ కావడంతో ఉపిరాడక తుదిశ్వాస విడిచింది. మణుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదం వెలుగు చూసింది. ఆడుకుంటూ వెళ్లి కారెక్కిన మూడేళ్ల చిన్నారి, కార్ డోర్స్ లాక్ అవడంతో మృతి చెందింది.

కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులోకి ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్ లాక్ అవడంతో చిన్నారి కారులోనే చిక్కుకుపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడ్డారు. చుట్టూ పక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు వెతికారు. అయితే ఫలితం లేకపోయింది. చివరికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారులో కనిపించింది కల్నిషా. వెంటనే కారు డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే తుదిశ్వాస విడిచింది చిన్నారి.

అల్లారు ముద్దుగా పెంచుకున్న మూడేళ్ళ కూతురు విగతజీవిగా కనిపించడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి, లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనకు సంబంధించి ప్రమాదవశాత్తూ మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..