TSRTC : గుడ్ న్యూస్ : ఇక ఉ. 6 గంటల నుంచి సా. 6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగుతాయ్.. మెట్రో కూడా.!

|

Jun 09, 2021 | 6:30 PM

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. లాక్​డౌన్ విరామ సమయం పెరగడంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచింది..

TSRTC : గుడ్ న్యూస్ : ఇక ఉ.  6 గంటల నుంచి సా.  6 గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగుతాయ్.. మెట్రో కూడా.!
TSRTC
Follow us on

TSRTC and Hyderabad Metro timings extended : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. లాక్​డౌన్ విరామ సమయం పెరగడంతో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను తిప్పే సమయాన్ని పెంచింది టీఎస్ఆర్టీసీ. ఫలితంగా రేపటి నుంచి రాష్ట్రంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆర్టీసీ బస్సులు తిరగనున్నాయి. లాక్​డౌన్​ విరామ సమయం పెరగడంతో బస్సులను తిప్పే సమయాన్ని పెంచామని ఆర్టీసీ ఆపరేషన్స్​ ఈడీ యాదగిరి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,600 బస్సులను మధ్యాహ్నం 2గంటల వరకు తిప్పుతున్నామని… వాటినే సాయంత్రం 6 గంటల వరకు తిప్పుతామని ఆయన స్పష్టం చేశారు. అటు, హైదరాబాద్ మెట్రో రైళ్ల ప్రయాణ వేళల్ని పెంచింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైళ్లను తిప్పుతామని హైదరాబాద్ మెట్రో తెలిపింది. చివరి రైలు సాయంత్రం 5 గంటలకు బయల్దేరుతుందని పేర్కొంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read also : Telangana lands : ‘సర్వే రాళ్లు ఊడిపోయినా, కొలతల కాగితాలు చినిగిపోయినా.. ఇంచు తేడా రాకుండా భూములకు రక్షణ’ : రెవెన్యూ శాఖ