Telangana: తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే

Telangana: రాజ్‌ కుమార్‌ బెయిల్‌పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక, తల్లి, నానమ్మ, పిల్లలను పొడిచి చంపాడు. జిల్లాలోని షాబాద్‌ మండలం దైవాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌లు ఘటన..

Telangana: తెలంగాణలో దారుణం.. కత్తితో పొడిచి ఆరుగురి హత్య.. కారణం ఇదే
Crime News

Updated on: Jul 11, 2026 | 6:50 AM

రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి ఆరుగురిని కత్తితోపోడిచి దారుణంగా హత్య చేశాడు. భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురిని హత్య చేశాడు. పోక్సో కేసు పెట్టారన్న కక్షతో నిందితుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. మే 16వ తేదీన బాధితురాలి తల్లి కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో 28 సంవత్సరాల వయస్సున్న రాజ్‌ కుమార్‌ బెయిల్‌పై తిరిగొచ్చి కక్షతో బాధిత బాలిక, బాలిక తల్లి, నానమ్మ, నిందితుడి భార్య సరిత, మూడేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు.

జిల్లాలోని షాబాద్‌ మండలం దైవాలగూడలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీ యోగేష్‌ గౌతమ్‌లు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

ఇదిలా ఉండగా, ఆరుగురిని హత్యచేసి నిందితుడు పరారయ్యాడు. అలాగే ఆరుగురిని హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్యచేసుకుంటానని తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us