Covid-19 Cases: తెలంగాణలో కరోనా ఉధృతి.. 3వేలు దాటిన యాక్టివ్‌ కేసులు.. ఆ మూడు జిల్లాలకు ముచ్చెమటలే..!

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఐదువందలకు చేరువైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 493 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది.

Covid-19 Cases: తెలంగాణలో కరోనా ఉధృతి.. 3వేలు దాటిన యాక్టివ్‌ కేసులు.. ఆ మూడు జిల్లాలకు ముచ్చెమటలే..!
Telangana Coronavirus

Updated on: Jun 24, 2022 | 7:19 PM

రాష్ట్రంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య ఐదువందలకు చేరువైంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 493 మందికి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివిటీ రేటు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 366 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 40 కేసులు పాజిటివ్‌గా తేలింది. అటు మేడ్చల్‌ జిల్లాలోనూ 34 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. శుక్రవారం నమోదైన కేసుల్లో 90 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3వేలు దాటింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 366 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం తదితర కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలతో బాలకృష్ణ కు కరోనా అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం బాలయ్య హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఇటీవలే బాలయ్య బసవతారకం హాస్పటల్ 22వ వార్షికోత్సవం లో పాల్గొన్నారు. బాలయ్యకు పాజిటివ్ అని తెలిసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. బాలకృష్ణ ప్రస్తుత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు బాలయ్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us