స్టీఫెన్ రవీంద్రకు పాజిటివ్
తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు ఇవాళ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం. స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న ఆయన సోమవారం కరోనా టెస్ట్..
తెలంగాణ ఐజీ స్టీఫెన్ రవీంద్రకు ఇవాళ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం స్టీఫెన్ హోం ఐసోలేషన్లో ఉన్నట్లు సమాచారం. స్వల్ప కరోనా లక్షణాలతో ఉన్న ఆయన సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా కొద్దిసేపటి క్రితమే పాజిటివ్ అని తేలింది. దీంతో గత వారం రోజులుగా రవీంద్రను కలిసినవాళ్లంతా కరోనా టెస్ట్లు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచించారు. కాగా, తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటివరకూ సుమారు 5వేల ఐదువందల మందికి కరోనా సోకింది. వారంతా కరోనాను జయించి విధుల్లో సైతం చేరారు. ఇలాఉండగా, రవీంద్రను ఆంధ్రప్రదేశ్ ఐబీ చీఫ్గా తీసుకోవాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖలు కూడా రాసింది. అటు, ఇంటర్ స్టేట్ బదిలీకి కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.