
– మధిర, నాగర్కర్నూలు, సంగారెడ్డి, ఆసిఫాబాద్లో కాంగ్రెస్ లీడ్
– లక్షెట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్, ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ ఆధిక్యం
– ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్ పోస్టల్ ఓట్లలో BJP లీడ్
– సంగారెడ్డి మున్సిపాలిటీలో 2 చోట్ల BRSకి పోస్టల్ ఓట్లలో ఆధిక్యం
– సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక వార్డులో MIM లీడ్
– ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ లీడింగ్
ఆదిలాబాద్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ
నిర్మల్ జిల్లా: నిర్మల్, ఖానాపూర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపి ముందంజ
మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట, మంచిర్యాల, చెన్నూర్ లలో పోస్టల్ బ్యాలెట్ లలో కాంగ్రెస్ ముందంజ
కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ ముందంజ
మంచిర్యాల జిల్లా: లక్షేట్టిపేట లో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ముందంజ
ఖమ్మం జిల్లా ఏదులా పురం మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ ఆధిక్యం
— నాగర్ కర్నూల్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి
— పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ ఆధిక్యం
— కాంగ్రెస్కు 17, బీఆర్ఎస్కు 06 పోస్టల్ ఓట్లు
— బీజేపీకి 04, ఇండిపెండెంట్ 02 పోస్టల్ ఓట్లు
— సంగారెడ్డి మున్సిపాలిటీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు
— మొత్తం 38 వార్డుల్లో 10 వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యం
— 2 వార్డుల్లో BRS ఆధిక్యం
— వార్డు నెంబర్ 2, 3, 4, 6, 7, 23, 26, 35, 36, 37, 38లో కాంగ్రెస్ లీడ్
— 1, 25 వార్డుల్లో BRS లీడ్
— 24వ వార్డులో MIM లీడ్
– మక్తల్ మున్సిపాలిటీలో 43 మంది పోస్టల్ ఓట్లు నమోదు చేసుకున్నారు.
– ఐతే.. వీటిల్లో 39 పోస్టల్ పోల్ అయ్యాయి.
– ఈ ఓట్లలో ఎవరికి ఆధిక్యం వచ్చింది అది కాసేపట్లో తేలబోతోంది.
– మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో అభ్యర్థి మృతి
– 10 వార్డ్ బీజేపీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో ఉదయం మృతి
– మధిర మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు
– పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్కి ఆధిక్యం
— మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై సీఎం రేవంత్ ధీమా
— ఢిల్లీ నుంచే మున్సిపల్ ఫలితాలపై మానిటరింగ్ చేస్తోన్న రేవంత్
— ఢిల్లీలోనే ఎప్పటికప్పుడు ఫలితాలను సమీక్షిస్తున్న రేవంత్ రెడ్డి
— మున్సిపోల్స్లో కాంగ్రెస్దే విజయమని ఇప్పటికే అధిష్ఠానానికి రేవంత్ రిపోర్ట్
— నిన్న రాహుల్, కేసీ వేణుగోపాల్తో సమావేశమై రిపోర్ట్ ఇచ్చిన రేవంత్
— మూడోరోజూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు సీఎం రేవంత్రెడ్డి
— నిన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
— రాబోయే పదిన్నరేళ్లు సీఎం కుర్చీ తనదే అన్నారు రేవంత్.. తనను టచ్ చేసేవారే లేరన్నారు
— తెలంగాణకు నేనే రాజు..నేనే మంత్రి అంటూ సినీ స్టైలులో కామెంట్స్ చేసిన సీఎం రేవంత్రెడ్డి
— తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్
— మొత్తం 2595 వార్డుల్లో 14 ఏకగ్రీవం
— 12 కాంగ్రెస్ సొంతం, 2 BRS వశం
— కాంగ్రెస్ సొంతమైన వాటిలో 7 ఉమ్మడి నల్గొండ జిల్లావే
— రామగుండం, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో రెండు డివిజన్లు ఏకగ్రీవం కాగా.. అవి రెండు కాంగ్రెస్ సొంత మయ్యాయి.
— కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఓట్ల లెక్కింపులో గందరగోళం
— స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి పోగొట్టిన అధికారులు
— గడ్డ పారతో తాళాన్ని పగలగొట్టిన అధికారులు
— మహబూబాబాద్ జిల్లాలో కాకరేపుతోన్న క్యాంప్ పాలిటిక్స్
— ఫలితాలు రాకముందే అన్ని పార్టీలూ అలర్ట్
— తమ అభ్యర్థులు చేజారకుండా క్యాంపు రాజకీయం
— నిన్న రాత్రే అభ్యర్థులను క్యాంప్నకు తరలించిన కాంగ్రెస్
— అభ్యర్థులతోపాటు వెళ్లిన ఎమ్మెల్యే మురళీనాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమ
— ప్రత్యేక బస్సులో క్యాంపునకు తరలివెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థులు
— కాంగ్రెస్ క్యాంప్ రాజకీయంతో హీటెక్కిన రాజకీయాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో 19 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ జరుగుతుంది. మొత్తం 403 వార్డులకు గాను మెదక్ మున్సిపాలిటీలో 32వ వార్డు ఏకగ్రీవమైంది. మిగతా 402 వార్డుల్లో కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మహబూబ్నగర్ కార్పొరేషన్లోని 60 డివిజన్లలో ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన 59 డివిజన్ల ఓట్ల లెక్కింపు కోసం 30 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర BNS 163 సెక్షన్ అమలులో ఉంది. కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ విజయేంద్ర పరిశీలించారు. పాలమూరు యూనివర్శిటీలో కౌంటింగ్ సెంటర్ను తనిఖీ చేశారు. భూత్పూర్, దేవరకద్ర మున్పిపాలిటీల్లో ఒక రౌండ్, మహబూబ్ నగర్లో రెండు రౌండ్లలో ఫలితం వెల్లడవుతుందని కలెక్టర్ తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల కార్పొరేషన్ సహా 8 మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంచిర్యాల కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ముల్కల్లలోని ఐజా ఇంజనీరింగ్ కాలేజీలో చేపడుతున్నారు. 60 వార్డులకు 60 టేబుల్స్ ఏర్పాటు చేసి లెక్కిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. 8 మున్సిపల్ కేంద్రాల్లో వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ పాలిటెక్నికల్ కాలేజీలో కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో డివిజన్కు ఒక్కో టేబుల్ చొప్పున మొత్తం 60 డివిజన్లకు 60 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. SRR కాలేజీలో కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు సిబ్బంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలు తేలనున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎన్నికల కౌంటింగ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైంది. కౌంటింగ్ సెంటర్లోకి అభ్యర్థితో పాటు, కౌంటింగ్ ఏజెంట్ ఒక్కరినే అనుమతించారు అధికారులు. 15 వార్డులకు గాను 15 టేబుల్స్ ఏర్పాటు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కార్పొరేషన్ సహా 17 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. ఐదు కేంద్రాల్లో కౌంటింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. కార్పొరేషన్కి సంబంధించి 48 డివిజన్ల కోసం 221 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఇక మున్సిపాలిటీల్లో 304 వార్డుల్లో 1396 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.
తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్ సహా 7 మున్సిపాలిటీలకు కౌంటింగ్ జరుగుతుంది. అన్ని మున్సిపాలిటీల్లో 2 రౌండ్స్లో ఫలితం తేలనుంది. కౌంటింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. కౌంటింగ్ హాల్లోకి అభ్యర్థులు, పాసులు ఉన్న ఏజెంట్స్కే అనుమతి ఇచ్చారు పోలీసులు.
— సంగారెడ్డిలో ఓట్ల లెక్కింపునకు అంతరాయం
— తారా డిగ్రీ కాలేజీలో కౌంటింగ్కి ఏర్పాట్లు
— రూమ్ నెంబర్ 6లో నిలిచిన విద్యుత్
— ఇంకా ప్రారంభం కాని పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే పని చేశాయి. చాలా చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ముఖ్యనేతలు పలు చోట్ల ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటరుతో టచ్లోకి వెళ్లారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్టు స్పష్టమవుతోంది.
పెరిగిన పోలింగ్ శాతం తమకే కలిసొస్తుందని ప్రధాన పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా తామే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి. అయితే చాలా చోట్ల అన్ని పార్టీల అభ్యర్థులు, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై ఫోకస్ చేయడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. దీంతో ఓట్ల లెక్కింపుపై పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
అత్యథికంగా చౌటుప్పల్లో 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా 59.68 శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది. ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధిక పోలింగ్ నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా పోలింగ్ రికార్డ్ అయ్యింది. ఉదయం 11 గంటల లోపే ఫలితం వస్తుంది. అత్యల్పంగా అలంపూర్లో 7,104 ఓట్లు పడ్డాయి. అలంపూర్ ఫలితం మొదటగా మొదటి రౌండ్లోనే రానుంది. అక్కడ పది వార్డులు ఉండగా పది టేబుళ్లు ఏర్పాటు చేశారు.
ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కౌంటింగ్పై ఆసక్తి పెరగింది. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది.
విజయోత్సవ ర్యాలీలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కొన్ని ఆంక్షలు విధించారు. ఉద్రిక్తతలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం చుట్టూ 100 మీటర్ల వరకు ఎవరినీ అనుమతించబోమని తెలిపారు. సాయంత్రానికి అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి.
ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం CCTV కెమెరాల నిఘాలో ఉంటుంది.
ఓట్ల లెక్కింపు కోసం 20 వేల మంది సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘం నియమించింది. వీరికి ఇప్పటికే బ్యాలెట్ పేపర్ల లెక్కింపుపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపులో భాగంగా మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
— ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు
— మరో గంటలో ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
— SRR కాలేజీలో కరీంనగర్ కార్పొరేషన్ 66 డివిజన్స్ ఓట్ల లెక్కింపు
— కరీంనగర్ 66 డివిజన్స్ ఓట్ల లెక్కింపునకు 66 టేబుల్స్ ఏర్పాటు
— రెండు డివిజన్లకు ఒక పర్యవేక్షకుడు చొప్పున నియామకం
— ప్రతి రౌండ్లో ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు లెక్కించనున్న సిబ్బంది
— మూడు నాలుగు రౌండ్లలో పూర్తికానున్న ఒక్కో డివిజన్ ఓట్ల లెక్కింపు
— మధ్యాహ్నం 12గంటల వరకు బ్యాలెట్స్ను కట్టలు కట్టనున్న సిబ్బంది
— సాయంత్రానికి తేలనున్న పూర్తి ఫలితాలు
— ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల ఫలితాలపై కొనసాగుతోన్న ఉత్కంఠ
— ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలు
— 8 మున్సిపల్ కేంద్రాల్లో వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు
— నిజామాబాద్ పాలిటెక్నికల్ కాలేజీలో కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు
— ఒక్కో డివిజన్కు ఒక్కో టేబుల్.. మొత్తం 60 డివిజన్లకు 60 టేబుల్స్ ఏర్పాటు
— ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు చొప్పున లెక్కింపు
— ఒక్కో కట్టలో 25 ఓట్లు.. ఒకేసారి 40 కట్టలు లెక్కించనున్న సిబ్బంది
కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాల్లో మెజారిటీ స్థానాలు బీజేపీ కైవసం చేసుకోబోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. యావత్ దేశమంతా కరీంనగర్ ఫలితాలవైపు చూస్తోందన్నారు. బీజేపీకి అనుకూల ఫలితాలు రాబోతున్నాయని, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని చరిత్ర సృష్టించబోతున్నామని ఆయన చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 123 కౌంటింగ్ స్టేషన్లను సిద్ధం చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనల జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డిజిపి పేర్కొన్నారు. లెక్కింపు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం 12 వేల మంది పోలీసు బలగాలతో పాటు సాయుధ బలగాలు , క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహారా కాస్తాయి. అదనపు భద్రత కోసం ప్రతి కౌంటింగ్ కేంద్రాన్ని సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంచామని తెలిపారు. వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను తన కార్యాలయ కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షిస్తామని వివరించారు. లెక్కింపు కేంద్రాలకు వచ్చే మార్గాలను కఠినంగా నియంత్రిస్తున్నామని, పాస్లు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల ఈ రకమైన గొడవలు తలెత్తడంతో పోలీసులు, ఈసీ అలర్ట్ అయ్యింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటోంది.
— కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది
— 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కౌంటింగ్ జరగనుంది
— ఆయా స్థానాల్లో ఈ నెల 11న పోలింగ్ నిర్వహించారు
— మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు
— 136 కేంద్రాలలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేశారు
— కౌంటింగ్ విధుల్లో 20 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు
— కౌంటింగ్లో పారదర్శకత కోసం CCTV ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు
— ఫస్ట్ రెండు గంటల్లో మొదటి ఫలితం రాబోతుంది
Telangana Municipal Poll Results 2026 LIVE: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11వ తేదీన పోలింగ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రాష్ట్రవ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అన్ని లెక్కింపు కేంద్రాల్లో, స్ట్రాంగ్ రూమ్ల బయట వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 15,000 నుంచి 20,000 మంది సిబ్బందిని నియమించారు. మొత్తం 116 మున్సిపాలిటీల్లోని 2,569 వార్డులకు పోలింగ్ నిర్వహించారు. తొమ్మిది మున్సిపాలిటీల్లో 12 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ నుంచి 2,358 మంది, బీఆర్ఎస్ నుంచి 2,478 మంది, బీజేపీ నుంచి 2,252 మంది సహా మొత్తం 10,719 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఒక్కొక్కటిగా లెక్కింపు టేబుల్ పైకి తీసుకువస్తారు. పోలింగ్ స్టేషన్ వారీగా బ్యాలెట్లను 25 చొప్పున కట్టలుగా కడుతారు. 25కు తక్కువగా మిగిలిన బ్యాలెట్లను ప్రత్యేకంగా కట్టి సంఖ్యతో లేబుల్ చేస్తారు. ప్రతి రౌండ్లో వెయ్యి బ్యాలెట్ల 25 చొప్పున 40 కట్టలు తీసుకుని ప్రతి టేబుల్కు పంపిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర అభ్యర్థుల తరపున ఒక కౌంటింగ్ ఏజెంట్ను అనుమతిస్తారు.
కౌంటింగ్ ప్రక్రియ మొత్తాన్ని సిసిటివీ కెమెరాల నిఘా ద్వారా పర్యవేక్షిస్తారు. ఒక్కో వార్డులో సుమారు 800 నుంచి 1,000 ఓట్లు ఉండటంతో, మధ్యాహ్నం 12 గంటల కల్లా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సాయంత్రానికి పూర్తి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనుండగా, అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా జరగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..