AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలోని ఆ ఐదు అద్భుత నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డుల ప్రదానోత్సవం.. దేశంలోనే తొలిసారి

తెలంగాణకు చెందిన పలు నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం విధితమే. హైదరాబాద్‌ నగరానికే ఐకాన్‌గా నిలిచిన దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జ్​, బీఆర్అంబేడ్కర్ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్​సెంటర్, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మొజాంజాహీ మార్కెట్‌లకు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డులు లభించాయి...

Telangana: తెలంగాణలోని ఆ ఐదు అద్భుత నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డుల ప్రదానోత్సవం.. దేశంలోనే తొలిసారి
Hyderabad
Narender Vaitla
|

Updated on: Jun 18, 2023 | 7:27 AM

Share

తెలంగాణకు చెందిన పలు నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న విషయం విధితమే. హైదరాబాద్‌ నగరానికే ఐకాన్‌గా నిలిచిన దుర్గం చెరువు కేబుల్​ బ్రిడ్జ్​, బీఆర్అంబేడ్కర్ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్​సెంటర్, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, మొజాంజాహీ మార్కెట్‌లకు అంతర్జాతీయ గ్రీన్ యాపిల్ అవార్డులు లభించాయి. ఈ నిర్మాణాలకు ఇంటర్నేషనల్​బ్యూటిఫుల్​ బిల్డింగ్స్​గ్రీన్​యాపిల్​ అవార్డులు దక్కాయి.

లండన్‌కు చెందిన గ్రీన్​ఆర్గనైజేషన్​సంస్థ ఈ అవార్డులను ఏటా అందిస్తుంది. ఈ ఐదు అవార్డులను పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్​కుమార్​స్వీకరించారు. అవార్డులు రావడం పట్ల తెలంగాణ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేసింది. 9 ఏళ్ల చరిత్ర గల రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే ఇంతటి ఘనతను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం. అంతేకాకుండా ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం మరో విశేషం.

ఇవి కూడా చదవండి

ఇదీ నేపథ్యం..

ఇదిలా ఉంటే గ్రీన్‌ యాపిల్‌ సంస్థ 2016 నుంచి అవార్డులను ప్రదానం చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణహిత కార్యక్రమాలను ప్రోత్సాహించే విషయంలో విశాలమైన ప్రాంతాల్లో నిర్మాణాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. పర్యావరణం విషయంలో కృషి చేస్తున్న సంస్థలు, సంఘాలకు అవార్డులు ఇస్తుంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..