Telangana Corona: తెలంగాణలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా.. మరణాలు నిల్‌.. కొత్తగా ఎన్ని కేసులంటే..

|

Feb 13, 2021 | 10:48 AM

Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు రెండు వేలకుపై గా పాజిఇవ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయాయి...

Telangana Corona: తెలంగాణలో పూర్తిగా తగ్గుముఖం పట్టిన కరోనా.. మరణాలు నిల్‌.. కొత్తగా ఎన్ని కేసులంటే..
Follow us on

Telangana Corona: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ఒకప్పుడు రెండు వేలకుపై గా పాజిఇవ్‌ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 27,259 మందికి కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 151 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే శుభవార్త ఏంటంటే గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదు. నిన్న కరోనా నుంచి 185 మంది వరకు కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 2,93,033కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,781 యాక్టివ్‌ కేసులుండగా, వారిలో 789 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు 82,69,364 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

Also Read: Covid-19 Pandemic: కరోనావైరస్ సమయంలో గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న జంటల సమస్యకు జింక్ అత్యుత్తమ పరిష్కారం