టీఆర్ఎస్ సర్కారుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నలు

|

Sep 14, 2020 | 8:42 PM

కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. ఫీల్డ్ సర్వే జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ సర్కారుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నలు
Follow us on

కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. ఫీల్డ్ సర్వే జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా బిల్లును ఆమోదించుకున్నారని విమర్శించారు. కేసీఆర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త రెవెన్యూ బిల్లు తెచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి మూడు సంవంత్సరాలు అవుతున్నా.. సర్వే ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేంద్రప్రభుత్వం.. రాష్ట్రంలో భూసర్వే చేసేందుకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. దేశంలో అనేక రాష్ర్టాలు ఇప్పటికే భూ సర్వే చేశాయి.. తెలంగాణలో చాలా ఆలస్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారని నెల జీతం బోనస్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఎద్దేవా చేశారు. అధికారం లేని వీఆర్వోలను అవినీతి పరులు అంటూ.. ఎమ్మార్వో, ఆర్డీవోలు నీతిమంతులు అని కేసీఆర్ చెపుతున్నారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.