ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు దుర్మరణం

|

Jul 19, 2022 | 8:40 PM

ఉట్నూర్ మండలంలోని పులి మడుగు మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని..

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు యువకులు దుర్మరణం
Accident
Follow us on

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని పులి మడుగు మూలమలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఉట్నూర్ ఎస్ ఐ సుమన్ భరత్ తెలిపిన వివరాల ప్రకారం..

ఉట్నూర్ కు చెందిన షాబాజ్ అనే యువకుడు హర్ష అనే వ్యక్తితో కలిసి ద్విచక్ర వాహనంపై ఆదిలాబాద్ వెళ్తుండగా మరో ఇద్దరు మోను రామ్, రవి గైక్వాడ్ లు మరో టూవీలర్‌ వాహనంపై ఉట్నూరు వైపు వస్తుండగా ఒక్కసారిగా ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టుగా ఎస్ఐ వివరించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ పంచనామా అనంతరం మృతదేహలను ఉట్నూర్ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి