Telangana: ‘పేపర్ లీక్ కేసు’లో ఏ1గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్టులో ఈటెల రాజేందర్ పేరు..

|

Apr 05, 2023 | 5:34 PM

తెలంగాణ ‘ఎస్ఎస్‌సీ పరీక్షా పేపర్ లిక్ కేసు’ రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ని ఏ1గా చేర్చారు రాష్ట్ర పోలీసులు. అలాగే ఏ2గా ప్రశాంత్‌, ఏ3గా మహేశ్ తదితరులు మొత్తం 8 మంది ఉన్నారు. ఇక వీరిలో బండి సంజయ్ సహా ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా..

Telangana: ‘పేపర్ లీక్ కేసు’లో ఏ1గా బండి సంజయ్.. రిమాండ్ రిపోర్టులో ఈటెల రాజేందర్ పేరు..
Bandi Sanjay
Follow us on

తెలంగాణ ‘ఎస్ఎస్‌సీ పరీక్షా పేపర్ లిక్ కేసు’ రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ని ఏ1గా చేర్చారు రాష్ట్ర పోలీసులు. అలాగే ఏ2గా ప్రశాంత్‌, ఏ3గా మహేశ్ తదితరులు మొత్తం 8 మంది ఉన్నారు. ఇక వీరిలో బండి సంజయ్ సహా ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఈ క్రమంలోనే బండి సంజయ్‌పై 8 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్ రిపోర్టు పేర్కొంది. అయితే పోలీసుల రిమాండ్ రిపోర్టులో వీరితో పాటు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, ఆయన పీఏ పేర్లు కూడా ఉన్నాయి.

కాగా, మంగళవారం అర్థరాత్రి 12 గంటల తరువాత కరీంనగర్‌లో బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వరంగల్ సీపీ రంగనాథ్ బుధవారం మాట్లాడుతూ.. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ, ఆ తర్వాత ప్రచారాల్లో బండి సంజయ్‌ హస్తం ఉందనే అభియోగంతో పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. ఇక వాటి ఆధారంగానే బండిపై 420, 120B, సెక్షన్ 5 ఆఫ్ మాల్‌ప్రాప్రాక్టీస్‌, సీఆర్‌పీసీ 154, 157  సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..