Telangana: తెలంగాణ ఎమ్మెల్యేలలో మెజారిటీ కోటేశ్వరులే.. క్రిమినల్‌ కేసులు కూడా..

|

Dec 07, 2023 | 7:28 AM

గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరు తనపై మర్డర్‌ (ఐపీసీ సెక్షన్‌ 302) కేసు ఉన్నట్లు తెలిపారు. ఇక 7 మంది ఎమ్మెల్యేలు అటెంప్ట్‌ టు మర్డర్‌ (ఐపీసీ సెక్షన్‌ 307) కేసు ఉన్నట్లు వెల్లడించారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమపై మహిళలపై నేరానికి సంబంధించిన కేసు ఉందని పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలో 51 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అంటే 80 శాతం మందిపై..

Telangana: తెలంగాణ ఎమ్మెల్యేలలో మెజారిటీ కోటేశ్వరులే.. క్రిమినల్‌ కేసులు కూడా..
TS Mla's
Follow us on

తెలంగాణలో తాజా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 119 మంది ఎమ్మెల్యేలలో 82 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా ప్రరటించినట్లు అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌, తెలంగాణ వాచ్‌ రిపోర్ట్‌ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఈ లెక్కన 69 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినలు కేసులు ఉన్నాయి. ఇక 2018లో 119 ఎమ్మెల్యేలలో 73 మందిపై క్రిమినలు కేసులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 82కి పెరిగింది.

గెలిచిన ఎమ్మెల్యేలలో ఒకరు తనపై మర్డర్‌ (ఐపీసీ సెక్షన్‌ 302) కేసు ఉన్నట్లు తెలిపారు. ఇక 7 మంది ఎమ్మెల్యేలు అటెంప్ట్‌ టు మర్డర్‌ (ఐపీసీ సెక్షన్‌ 307) కేసు ఉన్నట్లు వెల్లడించారు. ఇక మరో ఇద్దరు ఎమ్మెల్యేలు తమపై మహిళలపై నేరానికి సంబంధించిన కేసు ఉందని పేర్కొన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం.. కాంగ్రెస్‌ పార్టీలో గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలో 51 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది. అంటే 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

ఇక ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలపై, బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలపై, సీపీఐ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యేపై, ఎమ్‌ఐఎ్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో తామే స్వయంగా ప్రకటించారు.

ఇక కాంగ్రెస్‌ పార్టీకి ఎందిన 31 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన 17 మంది, బీజేపీకి చెందిన ఏడుగురు, సీపీఐకి చెందిన ఒక్క ఎమ్మెల్యే, ఎమ్‌ఐఎమ్‌ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తమపై సీరియస్‌ క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కాన్నారు. ఇదిలా ఉంటే మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 114 మంది అంటే 96 శాతం మంది కోటీశ్వరులేనని నివేదికలో తేలింది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన 60 మంది, బీఆర్‌ఎస్‌కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన ఒక్క ఎమ్మెల్యే, ఎమ్‌ఐఎమ్‌ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలను వెల్లడించే సమయంలో రూ. కోటీకి పైగా ఉన్న వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల ఆస్తుల విలువ సరాసరి రూ. 48.20 కోట్లుకాగా, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల విలువ రూ. 32.62 కోట్లు, బీజేపీ నాయకుల ఆస్తులు రూ. 21,83 కోట్లు, సీపీఐ నాయకుడి ఆస్తుల విలు రూ. 2.33 కోట్లు, ఎమ్‌ఐఎమ్‌ నాయకుల ఆస్తుల విలువ రూ. 13.19 కోట్లుగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

చెన్నూరు అసెంబ్లీ నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ నాయకుడు గడ్డం వివేకానంద ఆస్తుల విలువ అత్యధికంగా రూ. 606 కోట్లుగా ఉండగా, తర్వాతి స్థానంలో రూ. 433 కోట్లతో పొంగులేటి శ్రీనివాస్‌ ఉన్నారు. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ రూ. 68 కోట్లుగా ప్రకటించారు. ఇక గెలిచిన వారి విద్యార్హతల విషయానికొస్తే.. 40 మంది ఎమ్మెల్యేలు 5 నుంచి 12వ తరగతి వరకు చదవగా, 72 మంది ఎమ్మెల్యేలు డిగ్రీ పూర్తి చేసినట్లు రిపోర్ట్‌లో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..