Telangana: మామిడి తోటలో మిస్టరీ గుంత గురించి పోలీసులకు ఫోన్.. అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపించగా..

|

Jun 04, 2022 | 1:25 PM

అక్కడ ఓ అనుమానస్పద గుంతను చూశామంటూ పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో కాప్స్ వెంటనే అక్కడికి వెళ్లారు. పరిస్థితిని అంచనా వేసి.. తవ్వకాలు షురూ చేశారు. చివరకు...

Telangana: మామిడి తోటలో మిస్టరీ గుంత గురించి పోలీసులకు ఫోన్.. అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపించగా..
Pothole
Follow us on

Hanumakonda district: హనుమకొండ జిల్లాలో ఓ గుంత ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. మాజీ ఎమ్మెల్యే మామిడి తోటలో పోలీసుల తనిఖీలు చేయడం చర్చనీయాంశమైంది. భీమదేవరపల్లి మండలం(Bheemdevarapalli Mandal )లోని పాల డైరీ పక్కన ఉన్న మామిడి తోటవైపు  వెళ్లిన స్థానికులకు అక్కడ అనుమానాస్పద గుంత కనిపించింది. గుంతను తవ్వి పూడ్చిన ఆనవాళ్లతో పాటు పైన కత్తి పెట్టి  ఉండటంతో.. వారికి ఏదో తేడాగా అనిపించింది. ఏమైనా మర్డర్ జరిగిందేమో.. ఎవర్నైనా పూడ్చి పెట్టారేమో అన్న అనుమానంతో  వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్పాట్‌ను పరిశీలించి.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వెంటనే ఆ గుంతను తవ్వించారు. అయితే అనూహ్యంగా  ఆ గుంతలో క్షుద్రపూజలు జరిపిన ఆనవాళ్లు లభ్యమయ్యాయి. అమావాస్య రోజున క్షుద్రపూజలు జరిపి ఉంటారేమో అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ తోటకు దగ్గర్లోని సీసీ విజువల్స్ పరిశీలిస్తున్నారు. ఈ గుంత విషయం స్థానికంగా పెద్ద చర్చనీయాంశమైంది. అదీ మాజీ ఎమ్మెల్యే తోట అవ్వడంతో ఇంకాస్త ప్రాధాన్యత పెరిగింది. త్వరలోనే ఈ చర్యకు పాల్పడిన నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..