Car Accident at Assembly: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఇటీవల విజయం సాధించిన సురభి వాణిదేవి.. వాహనం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం వాణీదేవి శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అసెంబ్లీ ప్రాంగణంలోకి రాగానే రైల్వే కౌంటర్ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ఎదుట భాగం పూర్తిగా ధ్వంసమైంది. అయితే.. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్మెన్ కారు నడిపినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిగత అధికారిని సస్పెండ్ చేసినట్టు సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలం నుంచి కారును తరలించారు.
అయితే ఇటీవల జరిగిన హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వాణీదేవీ టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. బీజేపీకి చెందిన రామచందర్రావు ఆమె చేతిలో ఓటమిపాలయ్యారు.
Also Read: