Medaram Jatara: నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భక్తుల పయనం

రాష్ట్ర ప్రజలకు ఎంతో విశిష్టమైన మేడారం మహా జాతర నేటి నుండి ఆరంభం కానుంది. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. బుధవారం నుంచి ఈ జనవరి 31 వరకు (జనవరి 28,29,30,31 తేదీల్లో) వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని..

Medaram Jatara: నేటి నుంచే మేడారం మహాజాతర ప్రారంభం.. సమ్మక్క-సారలమ్మకు మొక్కులు చెల్లించేందుకు భక్తుల పయనం
Sammakka Sarakka Jatara

Updated on: Jan 28, 2026 | 7:39 AM

మేడారం, జనవరి 28: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో విశిష్టమైన మేడారం మహా జాతర నేటి నుండి ఆరంభం కానుంది. రెండేళ్లకోసారి కోలాహలంగా జరిగే ఈ మహా జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందింది. బుధవారం నుంచి ఈ జనవరి 31 వరకు (జనవరి 28,29,30,31 తేదీల్లో) వైభవంగా జరిగే జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రూ.251 కోట్ల నిధులతో సర్కార్ సమ్మక్క, సారలమ్మ తల్లులు గద్దెల ప్రాంగణాన్ని పునర్నిర్మించింది. అంతేకాకుండా భక్తులకు అవసరమైన సకల సౌకర్యాలు కల్పించింది. ఇక సారలమ్మ జాతరతో మొదలై మొత్తం నాలుగు రోజుల పాటు ఈ మహాజాతర జరగనుంది.

ఈ రోజు సాయంత్రం గద్దెల పైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ఆగమనం చేయనున్నారు. కన్నెపల్లి నుండి సారలమ్మ, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు, కొండాయి నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలను గద్దెలపై పూజారులు ప్రతిష్టించనున్నారు. కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాళీ నడకన బయలుదేరారు. పగిడిద్దరాజు పూజారులు పూనుగొండ్ల నుండి 65 కి.మీ నడుచుకుంటూ మేడారంకు వస్తున్నారు. సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకనున్నారు.

ఈసారి రాష్ట్రంతోపాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసీలు, ఇతర భక్తులు కోటి మంది వరకు తరలిరానున్నట్లు అంచనా. మేడారం మహాజాతరకు ఈసారి పోలీసులు కృత్రిమ మేధ ఉపయోగించి అనేక సౌకర్యాలు కల్పించారు. తప్పిపోయిన చిన్నారులను గుర్తించేందుకు తొలిసారిగా ఏఐ సాంకేతికతను వినియోగిస్తున్నారు. రహదారులు-భవనాలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, విద్యుత్తు, గిరిజన సంక్షేమ, దేవాదాయ, పోలీసు, ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక తదితర 21 శాఖల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. నెల రోజుల నుంచే మేడారానికి భక్తుల రాక మొదలవగా.. ఇప్పటివరకు సుమారు 50 లక్షల మంది దర్శించుకున్నట్టు అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.