
హైదారబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్లో సమీపంలోని ORR ఎక్సిట్ 16 వద్ద ఆగి ఉన్న ఓ లారీని వ్యాగనార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారుకు కూడా ఉన్నట్టు సమాచారం. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమింకగా నిర్ధారణకు వచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.