Col Santhosh Babu: దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు

|

Nov 23, 2021 | 12:05 PM

దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. 

Col Santhosh Babu: దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు
Santhosh Babu
Follow us on

దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర అవార్డు లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతోష్ బాబు భార్య, తల్లికి మహావీర్ చక్ర అవార్డును ప్రదానం చేశారు. గత సంవత్సరం గాల్వాన్ లోయలో భారత్‌ – చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో సంతోష్‌ బాబు వీరమరణం పొందారు. 

సూర్యాపేట జిల్లాకు చెందిన సంతోష్‌బాబు..  16 బిహార్‌ రెజిమెంట్‌కు కమాండింగ్ అధికారిగా వ్యవహరించారు.  చైనా బలగాలు దురాక్రమణకు యత్నించగా.. భారత జవాన్లు దీటుగా తొప్పికొట్టారు. ఈ క్రమంలో చెలరేగిన ఘర్షణల్లో సంతోష్‌బాబు సహా 21 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. సంతోష్ బాబు సేవలకు మరణానంతరం మహావీర్‌ చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది.

 


Read Also.. Railway News: రైల్వే ప్యాసింజర్ అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు