Hyderabad: హైదరాబాద్‌లో దారుణ హత్య.. సీసీ కెమెరాల పరిశీల.. కుటుంబీకుల షాకింగ్‌ ఆరోపణ

|

Oct 01, 2024 | 1:53 PM

హైదరాబాద్‌ మియాపూర్​లోని దీప్తిశ్రీనగర్‌ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిన్న ఉదయం 10 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్​లోకి చొరబడి కత్తి, ఐరన్ రాడ్డుతో స్పందన మొఖం, శరీర భాగాలపై విచక్షణరహితంగా దాడిచేసి చంపారు. తర్వాత బయటి నుంచి ఇంటి మెయిన్​ డోర్​ లాక్​ చేసి పారిపోయారు. హత్యకు..

Hyderabad: హైదరాబాద్‌లో దారుణ హత్య.. సీసీ కెమెరాల పరిశీల.. కుటుంబీకుల షాకింగ్‌ ఆరోపణ
Follow us on

హైదరాబాద్‌ మియాపూర్​లోని దీప్తిశ్రీనగర్‌ లో దారుణం చోటు చేసుకుంది. భర్తకు దూరంగా ఉంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిన్న ఉదయం 10 గంటల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులు ప్లాట్​లోకి చొరబడి కత్తి, ఐరన్ రాడ్డుతో స్పందన మొఖం, శరీర భాగాలపై విచక్షణరహితంగా దాడిచేసి చంపారు. తర్వాత బయటి నుంచి ఇంటి మెయిన్​ డోర్​ లాక్​ చేసి పారిపోయారు. హత్యకు గురైన మహిళ స్పందనగా గుర్తించారు పోలీసులు.

అయితే సాయంత్రం 4 గంటలకు స్కూల్​నుంచి ఇంటికి వచ్చిన స్పందన తల్లి తాళం వేసి ఉండడడాన్ని చూసి కూతురుకు కాల్​చేసింది. ఎంతకీ ఫోన్​తీయకపోవడంతో తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా రక్తపు మడుగులో స్పందన విగతజీవిగా పడి ఉంది. మియాపూర్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీంతో వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అపార్ట్​మెంటులోని సీసీ కెమెరాలను పరిశీలించారు. స్పందనను హత్య చేసింది ఆమె భర్తేనని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విడాకుల కేసు కోర్టు విచారణలో ఉందని తెలిపారు కుటుంబ సభ్యులు.

ఏపీలోని వైజాగ్​కు చెందిన విజయ్​కుమార్, బండి స్పందనకు 2022 ఆగస్టు 4న పెళ్లైంది. వీరిద్దరూ మియాపూర్​ దీప్తీశ్రీనగర్​లో కాపురం పెట్టారు. 10 నెలల తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థాలు పెరిగాయి. దీంతో స్పందన.. ఆమె తల్లి నమృత, సోదరుడితో కలిసి నివసిస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి