Monsoon: హమ్మయ్య.! ఏపీ, తెలంగాణలకు చల్లటి కబురు.. మరో ఐదు రోజుల్లో..

హమ్మయ్య.! ఎన్నాళ్లకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఎట్టకేలకు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి.

Monsoon: హమ్మయ్య.! ఏపీ, తెలంగాణలకు చల్లటి కబురు.. మరో ఐదు రోజుల్లో..
Monsoon

Updated on: Jun 09, 2023 | 9:41 AM

హమ్మయ్య.! ఎన్నాళ్లకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఎట్టకేలకు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా దేశంలోకి ప్రవేశించాయి. జూన్ 8న ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలను తాకాయి. అయితే ఆరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 48 గంటల్లో కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి.. ఆ తర్వాత కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను తాకే అవకాశముందని అంచనా వేస్తున్నారు.

ఇదే చురుకుదనంతో రుతుపవనాలు కదిలితే ఈ నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోకి, అనంతరం జూన్ 15వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి జూన్ 10 కల్లా రుతుపవనాలు తెలంగాణను తాకాలి. కానీ వాతావరణ మార్పులు, తుఫాన్ కదలికల కారణంగా ఆలస్యమైంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం ఉత్తర తెలంగాణలోని నల్గొండ, సూర్యాపేట, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో శుక్రవారం వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే ఈరోజు, రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us