Hyderabad Traffic Rules: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త నిబంధనలు.. ఇక రూల్స్‌ అతిక్రమిస్తే బాదుడే.. బాదుడు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చారు. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రోడ్డు..

Hyderabad Traffic Rules: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కొత్త నిబంధనలు.. ఇక రూల్స్‌ అతిక్రమిస్తే బాదుడే.. బాదుడు
Hyderabad Traffic Rules

Updated on: Sep 30, 2022 | 9:12 PM

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు అందుబాటులోకి తీసుకువచ్చారు. చాలా మంది వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా నిబంధనలను పాటించడం లేదు. దీంతో పోలీసులు నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు. ఇప్పటి వరకు లైసెన్స్‌ లేకుంటే, ఒక బైక్‌పై ముగ్గురు ప్రయణించడం, హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, కారు సీటు బెల్టు పెట్టుకోకపోవడం లాంటివి జరిగితే భారీగా జరిమానా విధించిన ట్రాఫిక్‌ పోలీసు.. ఇప్పుడు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువస్తున్నారు. సిగల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ దాటితే కఠినంగా వ్యవహరిస్తున్నారు.

కొత్త రూల్స్‌లో భాగంగా ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద వాహనదారులు నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలుకు దిగుతున్నారు. వాహనదారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద స్టాప్‌ లైన్‌ తాటినట్లయితే రూ.100 జరిమానా విధించనున్నారు. అంతేకాకుండా ఇదే సమయంలో సిగ్నళ్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే ఏకంగా 1000 రూపాయల జరిమానా విధించనున్నారు. ఇక పాదచారులకు అడ్డంగా వాహణాలు నిలిపే వారికి రూ.600 పెనాల్టీ విధించనున్నారు. అంతేకాకుండా ఫుట్‌పాత్‌లపై వస్తువులు పెట్టే దుకాణాదారులపైనా భారీగా జరిమానా విధించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే ఈ నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయంటున్నారు సిటీ పోలీసులు.

పార్కింగ్‌ కోసం స్థలం కేటాయించాల్సిందే..

ఇవి కూడా చదవండి

అయితే ఆర్టీసీ బస్సులు బస్‌బేలలోనే నిలిపేటట్లు చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్‌ పోలీసులకు సీవీ ఆనంద్‌ సూచించారు. అలాగే ఆటోలు ఎక్కడ పడితే అక్కడ నిలుపకుండా చర్యలు చేపట్టాలన్నారు. వీధి వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు.. రహదారులు, ఫుట్ పాత్ ల పైకి రాకుండా చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. భారీ అంతస్తుల నివాస సముదాయాలు, విద్యా సంస్థల్లో 30శాతం స్థలాన్ని పార్కింగ్ కోసం కేటాయించాల్సి ఉంటుంది. హోటళ్లు, లాడ్జ్ లు, వాణిజ్య భవనాల్లో 40శాతం, షాపింగ్ మాల్స్‌, మల్టిప్లెక్స్‌లలో 60శాతం పార్కింగ్ కోసం కేటాయించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేయలేని భవనాలపై చర్యలు తీసుకునే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ముందుకు సాగనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి