Hyderabad: గడసరి పెళ్ళాం.. అమాయకపు మొగుడు.. ఇద్దరూ ఇద్దరే.. ఏం చేశారంటే..

|

Apr 19, 2024 | 1:33 PM

పెళ్లాం పోరు పడలేక భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కోంపల్లిలో జరిగింది. తన భార్య చీటికి మాటికి ఇబ్బంది పెడుతోందని వాపోయాడు. ఆమె టార్చర్ భరించడం నావల్ల కాదంటూ ఆత్మహత్యే మార్గం అని చెరువులోకి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. నగేష్ ను బయటకు రావల్సిందిగా బ్రతిమాలారు.

Hyderabad: గడసరి పెళ్ళాం.. అమాయకపు మొగుడు.. ఇద్దరూ ఇద్దరే.. ఏం చేశారంటే..
Nagesh
Follow us on

పెళ్లాం పోరు పడలేక భర్త ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని కోంపల్లిలో జరిగింది. తన భార్య చీటికి మాటికి ఇబ్బంది పెడుతోందని వాపోయాడు. ఆమె టార్చర్ భరించడం నావల్ల కాదంటూ ఆత్మహత్యే మార్గం అని చెరువులోకి దిగాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు చేరుకున్నారు. నగేష్ ను బయటకు రావల్సిందిగా బ్రతిమాలారు. అయితే తన భార్యతో ఎలాగైనా విడాకులు ఇప్పించాలని కోరాడు భర్త నగేష్. ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు అతని బాధ విని పరిష్కారం చూపుతామన్నారు. నచ్చజప్పే ప్రయత్నం చేశారు.

హైదరాబాద్ కొంపల్లికిలో తన భార్యతో కలిసి ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నాడు నగేష్. అయితే గత కొంత కాలంగా తన భార్య వేధింపులు తాళలేక పోతున్నా అని చెప్పాడు. తన పిల్లలకు ప్రేమగా చాక్లెట్లు తీసుకువచ్చి ఇస్తే వాటిని ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుందని చెప్పాడు. పైగా పిల్లలతో మాట్లాడించేందుకు కూడా నిరాకరిస్తోందని తెలిపాడు. అడిగితే వాతలు పెడుతోందని తన టీ షర్ట్ విప్పి చూపించాడు. గత కొన్ని రోజులుగా ఈ టార్చర్ భరిస్తూ వచ్చిన భర్త నగేష్ విసిగిపోయి ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అందుకే కొంపల్లి సమీపంలోని జయభేరి పార్క్ వద్ద ఉన్న చెరువులో దిగాడు. దీనిని గమనించిన స్థానికులు ఎందుకు చెరువులో దిగావు బయటకు రామ్మని అడగగా తన ఆవేదనను స్థానికులతో పంచుకున్నాడు. దీనికి పరిష్కారం చూపితేనే బయటకు వస్తానని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు నగేష్. విషయం తెలుసుకున్న స్థానికులు నగేష్ కు నచ్చజెప్పి విడాకులు ఇప్పిస్తామని చెప్పడంతో చెరువులో నుంచి బయటకు వచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..