భాగ్య నగరంలో హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలి గూడ శ్రీరామ మందిరం నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర తాడ్బండ్ వరకు కొనసాగింది. శోభాయాత్రలో భారీగా హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. రామ నామ జపం చేస్తూ భక్తులు పులకించిపోయారు. నిఘా కోసం సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సుమారు 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 20 వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం కావడంతో శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు గట్టి చర్యలు తీసుకున్నారు.