TRS Plenary Flexis: ఫ్లెక్సీలు కట్టారుగా జరిమానాలు కట్టండి.. ఆ పార్టీ నాయకులకు భారీ ఫైన్లు..

|

Oct 28, 2021 | 7:57 PM

టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆ నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్లు వేసింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు..

TRS Plenary Flexis: ఫ్లెక్సీలు కట్టారుగా జరిమానాలు కట్టండి.. ఆ పార్టీ నాయకులకు భారీ ఫైన్లు..
Trs Plenary Flex
Follow us on

TRS Plenary Flex: టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఆ నేతలకు జీహెచ్ఎంసీ ఫైన్లు వేసింది. టీఆర్ఎస్ ఫ్లెక్సీలపై ఇతర పార్టీల నాయకులు ఫిర్యాదులు చేయడంతో విజిలెన్స్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డిపార్ట్‎మెంట్ రియాక్ట్ అయ్యింది. గత కొన్ని రోజుల నుంచి సెంట్రల్ ఎన్‎ఫోర్స్‎మెంట్ సెల్ సర్వర్ డౌన్ ఉండటం కారణంగా ఫైన్లను నిలిపేసిన అధికారులు.. ఇవాళ్టి నుంచి మళ్లీ ఫైన్లను వేయడం మొదలు పెట్టారు. ప్లీనరీ సందర్భంగా బంజారా‎హిల్స్ రోడ్ నెంబర్ 3లో కటౌట్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్‎కు జీహెచ్ఎంసీ అధికారులు 2 లక్షల 35 వేల జరిమానా విధించారు.

అదేవిధంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు లక్ష 5 వేల రూపాయల జరిమానా విధించింది. మంత్రి మల్లారెడ్డికి 10,000 రూపాయల ఫైన్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి 25 వేల రూపాయల ఫైన్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ పేరుతో 95,000 రూపాయల జరిమానా విధించింది.

టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్ నగరంను గులాబీ మయంగా మారింది. చల్లాన్ల వసూళ్లలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.

ఇవి కూడా చదవండి: Chat Without Internet : ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్‌ చాట్ చేయండి.. ఎలానో తెలుసా..

Prashant Kishor: మరో 40 ఏళ్లు అధికారం బీజేపీదే.. సమస్యంతా రాహుల్ గాంధీలోనే.. హాట్ కామెంట్ చేసిన పీకే..