Hyderabad: ‘పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు’.. హేమ సూటి ప్రశ్న

|

Apr 03, 2022 | 1:27 PM

నైజీరియన్స్‌ నుంచి మొదలు కొని.. లోకల్స్‌ వరకు డ్రగ్స్‌ పెడ్లర్‌గా మారి వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్‌ను అడ్డాగా చేసుకొని మత్తు దందా నడిపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని సార్లు వార్నింగ్‌ ఇచ్చినా ఎక్కడా ఆ ప్రభావం కనిపించడం లేదు.

Hyderabad: పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు.. హేమ సూటి ప్రశ్న
Hema
Follow us on

హైదరాబాద్‌లోని పుడింగ్ పబ్‌లో డ్రగ్స్‌ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల పిల్లలు పబ్‌లో ఉన్నారని తేలడంతో అందరి ఇంట్రెస్ట్‌ ఇటువైపే నిలుస్తోంది. అయితే.. తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ కొందరు ప్రముఖులు ఖండించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సినీ నటి హేమ ఏకంగా బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ దగ్గరకు వచ్చారు. నేను పబ్‌లో లేకపోయినా.. నా పేరు ఎందుకు బయటకు తెచ్చారంటూ సూటిగా నిలదీశారామె. పబ్‌లో దొరికినవారిలో తమ కుటుంబసభ్యులు ఎవరూ లేరంటూ గల్లా కుటుంబం ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది. తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. తన కుమారుడిని ఈ కేసులో ఇరికిస్తున్నారంటూ సికింద్రాబాద్‌ మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేస్తున్నట్టు చెప్పారు నటి హేమ. ఇంత పెద్ద కేసులో తన పేరును ఇన్వాల్స్ చేసి.. బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహిళపై ఈ విధమైన ప్రచారం సరికాదన్నారు. తన గురించి తప్పుగా ప్రచారం చేసినవారిపై కేసు పెట్టేందుకు వచ్చినట్లు ఆమె క్లియర్ కట్‌గా చెప్పారు.

Also Read: Hyderabad: సంచలనం రేపుతోన్న పుడింగ్ పబ్ వ్యవహారం.. లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవి