Hyderabad: సైబర్‌ నేరాల్లో ఇది పరాకాష్ట.. రూ. 8 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..

| Edited By: Narender Vaitla

Oct 27, 2024 | 1:12 PM

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగపోతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని రకాల చర్యలు చేపట్టినా నేరస్థులు మాత్రం ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి సైబర్ దాడిలో ఏకంగా రూ. 8 కోట్లు పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ అంశం తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసింది. షేర్ మార్కెట్ పేరుతో జరిగిన ఈ మోసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Hyderabad: సైబర్‌ నేరాల్లో ఇది పరాకాష్ట.. రూ. 8 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు..
Cyber Crime
Follow us on

షేర్లలో పెట్టుబడులు పేరిట సైబర్ నేరస్థుల మోసాలు కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ బంజరాహిల్సకు చెందిన ఇంజనీరింగ్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ నుంచి ఏకంగా 8 కోట్ల రూపాయలను కాజేశారు సైబర్ నేరస్తులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో ఈ కేసు నమోదు అయింది మిలానీ లయన్స్ ఎస్సై జి అని గ్రూప్ నిర్వాహకుల పేరిట బాధితుడికి సెల్ఫోన్కు జూలై మొదటి వారిలో ఒక లింకు వచ్చింది ఓపెన్ చేసి ఎస్ఐజి ట్రెండింగ్ అని వాట్సప్ గ్రూప్ లో చేరారు.

తొలత షేర్ మార్కెట్ బ్లాక్ రేట్ ఐపిఓల గురించి నిర్వాహకులు కీలక సమాచారం అందించారు 20 రోజుల తర్వాత ఎరిక్ రాబర్ట్ సన్ అతడి సహకరాలు మిలానీ లయన్ సిఫార్సుతో బాధితుడిని ఆర్కే గ్లోబల్ యాప్ లో బాధితుడని చేర్పించారు. ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టించడం ప్రారంభించారు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ద్వారా ఐపివోలు దగ్గర చేస్తామని దాంతో భారీగా లాభాలు వస్తాయని ఆశపెట్టారు.

బాధితుడు అందుకు అంగీకరించడంతో కొన్ని బ్యాంకు ఖాతాల నెంబర్లను సూచించి వాటిలోకి ఆన్‌లైన్‌లోనే నగదు బదిలీ చేయాలని సూచించారు అలా ఆర్కే గ్లోబల్ యాప్ ద్వారా జూలై 16 నుంచి నగదు బదిలీ ప్రారంభించారు ఇలా పెట్టిన పెట్టుబడికి కోట్లల్లో లాభాలు వచ్చినట్లు డీమార్ట్ ఖాతాలో కనిపించేవి జులై 22న 2000 ఉప సంహరించుకోవాలనుకోవడంతో బాధితులలో నమ్మకం ఏర్పడింది. దీంతో పలు విడతలుగా బాధితులు సొమ్ము బదిలీ చేశారు సెప్టెంబర్ 19 కొంత డబ్బులు డ్రా చేసుకున్నాడు. అయితే యాప్‌లో కనిపించిన మొత్తం డబ్బు మాత్రం ఖాతాలోకి జమ కాలేదు.

అయితే ఆ సమయానికి లాభాలతో కలిపి ఖాతాలో 37.5 కోట్ల కనిపిస్తోంది నగదు డ్రా కోసం ఆ మొత్తం పై రెండు శాతం చెల్లించాలని మళ్లీ మోసం చేశారు. దీంతో సుమారు రూ. 75 లక్షల చెల్లించాడు. అనంతరం సెబీ తనిఖీల పేరిట మరో రెండు కోట్ల జమ చేయాలని సూచించారు అంత చెల్లించలేనని బాధితుడు చెప్పడంతో 1.25 కోట్లు రుణంగా ఇస్తామంటూ.. నమ్మబలికారు. మిగిలిన రూ. 75 లక్షలను బాధితుడితో జమ చేయించుకున్నారు. అలా ఆయన నుంచి 8.15 కోట్ల రూపాయలను కాజేశారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..