Hyderabad: ఫ్లాట్‌లో ఫ్రెండ్‌తో ఏకాంతంగా 20 ఏళ్ల యువతి.. కొద్దిసేపటికి తండ్రి ఎంట్రీ ఇవ్వగా

పాత బస్తీకి చెందిన 20 ఏళ్ల యువతి నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది.

Hyderabad: ఫ్లాట్‌లో ఫ్రెండ్‌తో ఏకాంతంగా 20 ఏళ్ల యువతి.. కొద్దిసేపటికి తండ్రి ఎంట్రీ ఇవ్వగా
Double Bedroom House

Edited By:

Updated on: Dec 21, 2025 | 1:48 PM

ఫ్రెండ్‌తో కలిసి ఫ్లాట్‌లో ఉన్న సమయంలో తండ్రి అక్కడికి రావడంతో భయపడిన ఓ యువతి, తప్పించుకునే ప్రయత్నంలో ఎనిమిదో ఫ్లోర్ నుంచి కిందపడి మృతి చెందిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాత బస్తీకి చెందిన 20 ఏళ్ల యువతి నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. యువతి కుటుంబానికి తెల్లాపూర్ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ ఉంది. గురువారం యువతి తన స్నేహితుడితో కలిసి ఆ ఫ్లాట్‌కు వెళ్లి అక్కడ ఏకాంతంగా గడుపుతున్నారు. ఈ సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు యువతి తండ్రి ఫ్లాట్‌కు వచ్చాడు. బయట నుంచి ఫ్లాట్‌కు తాళం వేసి ఉన్నా.. లోపల నుంచి చప్పుళ్లు రావడంతో.. ఎవరో ఉన్నట్లు అనుమానం రావడంతో తండ్రి బయట నుంచి కేకలు వేశాడు.

తండ్రి వచ్చాడన్న భయంతో యువతి, ఆమె ఫ్రెండ్ పక్క ఫ్లాట్ వైపు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎనిమిదో అంతస్తులోని బాల్కనీ నుంచి యువతి కిందపడింది. తీవ్ర గాయాల పాలైన ఆమె స్పాట్‌లోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫాతిమా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.